తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి.. పుట్టలోని చెదలు పుట్టదా.. గిట్టదా.? అన్నారు వేమన.. అయితే మారుతున్న కాలంతో పాటు మానవీయ సంబంధాలన్నీ మనీ రిలేషన్ సంబంధాలుగా మారుతున్నాయని అంటున్నారు మోడ్రన్ వేమనలు. అనురాగాలు, అప్యాయతలు పోయి అనుబంధాలన్నీ మనీ సంబంధాలుగా మారిపోతున్నాయి. పెదాలపై ప్రేమే తప్ప.. మనస్సులలో కల్మషాలు మెండుగా పెరిగిపోతున్నాయి. అన్నదమ్ముల అనుబంధం, అక్కాచెల్లళ్ల అనురాగాన్ని ఇవి పూర్తిగా దెబ్బతీసాయి.
అయితే అన్నదమ్ములు, అడపడచులకే పరిమితమైన అస్తుల గొడవలు ఇక తాజగా తల్లి బిడ్డలకు కూడా వ్యాపించాయి. ఇటీవలే బాంబే హైకోర్టు తల్లిని వేధించే కొడుకుకు ఆమె ఇంట్లో నివసించే, కనిసం ప్రవేశించే అనుమతి కూడా లేదంటూ సంచలన తీర్పును వెలువరించినా.. కొడుకులు మాత్రం తల్లిదండ్రులను అస్తుల కోసం నానా ఇబ్బందులు పెడుతున్నారు. అలాంటి ఘటనే తాజాగా నవ్యాంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో సంభవించింది. తనకు అస్తిని పంచాలని తల్లిదండ్రులతో నానా యాగి సృష్టించిన కొడుకును కన్న తల్లి రాడ్ తో కొట్టి హతమార్చింది.
కాకానాడలోని జగన్నాధపురంలోని రామాలయం గుడికి సమీపంలో వున్న ఏసువారి వీధిలో ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బీటెక్ చదవికి ఖాళీగా వున్న శివరామకృష్ణా రెడ్డి ఉద్యోగాలు రాకపోవడంతో ఇక ఆ ప్రయత్నాలు మాని.. తాను వ్యాపారం చేసుకుంటాను అందుకుగాను పెట్టుబడిగా తనకు 50 లక్షల రూపాయాలు అవసరమని అందుకోసం అస్తని అమ్మి తనకు డబ్బు సమకూర్చాల్సిందిగా తరచూ తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగుతున్నాడు. ఈ క్రమంలో క్రితం రోజు రాత్రి కూడా తల్లిదండ్రులతో గొడవ పడిన శివరామకృష్ణ తన కూడా ఐరాప్ రాడ్ ను తెచ్చుకున్నాడు.
తన తండ్రి చిన్నం వీరప్రతాప్ రెడ్డిపై దాడికి కూడా యత్నించాడు. అయితే ఈ వాగ్వాదం నేపథ్యంలో ఇంట్లోని ఫ్లోర్ పై ఆయన కాలు జారి కిందపడ్డాడు. ఇంతలో కోపంతో ఊగిపోతున్న తల్లి పార్వతి.. అతని చేతి నుంచి జారిపడిన ఇనుప రాడ్డును తీసుకుని కొడుకు తలపై మోదడంతో అతను తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితురాలైన పార్వతిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ హత్యకేసులో తండ్రి, తాతల ప్రమేయుం వుందా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more