property dispute: mother beaten son to death in kakinada కాకినాడలో దారుణం: కన్నకొడుకును కొట్టిచంపిన తల్లి..

Property dispute mother beaten son to death in kakinada

mother killed son in kakinada, son killed by mother in kakinada, ramakrishna reddy killed by mother, mother beaten son to death, ramakrishna reddy, mother, son, property dispute, father, kakinada, andhra pradesh, viral news, crime

Yet in an another tragedic incident in kakinada of andhra pradesh, a son ramakrishna reddy, who created ruckus for fathers property dispute was killed by mother.

కాకినాడలో దారుణం: కన్నకొడుకును కొట్టిచంపిన తల్లి..

Posted: 05/22/2018 09:53 AM IST
Property dispute mother beaten son to death in kakinada

తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి.. పుట్టలోని చెదలు పుట్టదా.. గిట్టదా.? అన్నారు వేమన.. అయితే మారుతున్న కాలంతో పాటు మానవీయ సంబంధాలన్నీ మనీ రిలేషన్ సంబంధాలుగా మారుతున్నాయని అంటున్నారు మోడ్రన్ వేమనలు. అనురాగాలు, అప్యాయతలు పోయి అనుబంధాలన్నీ మనీ సంబంధాలుగా మారిపోతున్నాయి. పెదాలపై ప్రేమే తప్ప.. మనస్సులలో కల్మషాలు మెండుగా పెరిగిపోతున్నాయి. అన్నదమ్ముల అనుబంధం, అక్కాచెల్లళ్ల అనురాగాన్ని ఇవి పూర్తిగా దెబ్బతీసాయి.

అయితే అన్నదమ్ములు, అడపడచులకే పరిమితమైన అస్తుల గొడవలు ఇక తాజగా తల్లి బిడ్డలకు కూడా వ్యాపించాయి. ఇటీవలే బాంబే హైకోర్టు తల్లిని వేధించే కొడుకుకు ఆమె ఇంట్లో నివసించే, కనిసం ప్రవేశించే అనుమతి కూడా లేదంటూ సంచలన తీర్పును వెలువరించినా.. కొడుకులు మాత్రం తల్లిదండ్రులను అస్తుల కోసం నానా ఇబ్బందులు పెడుతున్నారు. అలాంటి ఘటనే తాజాగా నవ్యాంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో సంభవించింది. తనకు అస్తిని పంచాలని తల్లిదండ్రులతో నానా యాగి సృష్టించిన కొడుకును కన్న తల్లి రాడ్ తో కొట్టి హతమార్చింది.

కాకానాడలోని జగన్నాధపురంలోని రామాలయం గుడికి సమీపంలో వున్న ఏసువారి వీధిలో ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బీటెక్ చదవికి ఖాళీగా వున్న శివరామకృష్ణా రెడ్డి ఉద్యోగాలు రాకపోవడంతో ఇక ఆ ప్రయత్నాలు మాని.. తాను వ్యాపారం చేసుకుంటాను అందుకుగాను పెట్టుబడిగా తనకు 50 లక్షల రూపాయాలు అవసరమని అందుకోసం అస్తని అమ్మి తనకు డబ్బు సమకూర్చాల్సిందిగా తరచూ తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగుతున్నాడు. ఈ క్రమంలో క్రితం రోజు రాత్రి కూడా తల్లిదండ్రులతో గొడవ పడిన శివరామకృష్ణ తన కూడా ఐరాప్ రాడ్ ను తెచ్చుకున్నాడు.

తన తండ్రి చిన్నం వీరప్రతాప్ రెడ్డిపై దాడికి కూడా యత్నించాడు. అయితే ఈ వాగ్వాదం నేపథ్యంలో ఇంట్లోని ఫ్లోర్ పై ఆయన కాలు జారి కిందపడ్డాడు. ఇంతలో కోపంతో ఊగిపోతున్న తల్లి పార్వతి.. అతని చేతి నుంచి జారిపడిన ఇనుప రాడ్డును తీసుకుని కొడుకు తలపై మోదడంతో అతను తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితురాలైన పార్వతిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ హత్యకేసులో తండ్రి, తాతల ప్రమేయుం వుందా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ramakrishna reddy  mother  son  property dispute  father  kakinada  andhra pradesh  viral news  crime  

Other Articles