అక్కినేని నటవారసత్వంతో తెలుగుతెరకు పరిచయమై పలు హిట్ చిత్రాలలో నటించిన అక్కినేని నాగార్జున మేనల్లుడు హీరో సుమంత్ ఇవాళ మార్కాపురం న్యాయస్థానంలో హాజరయ్యాడు. తన సోదరి సుప్రియ తో ఫాటు ఆయన ప్రకాశం జిల్లాలోని మార్కాపురం మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. 'నరుడా డోనరుడా' సినిమాకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో వారు కోర్టుకు హాజరయ్యారు.
ఈ ఇద్దరూ కలిసి జాన్ సుధీర్ తో కలిసి 'నరుడా డోనరుడా' సినిమాను నిర్మించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద నిలువలేకపోయింది. చిత్రం పరాజయం పాలైన క్రమంలో ఆశించిన వసూళ్లు రాకపోవడంతో వారు పలువురికి ఇచ్చిన కమిట్ మెంట్లకు గాను చెక్కులను జారీ చేశారు. ఈ క్రమంలోఈ సినిమాకు ఫైనాన్స్ అందించిన ఫైనాన్షియర్ తనకు ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో వారిని పలుమార్లు కోరినా ప్రతిస్పందన కరువైంది. దీంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
కాగా, ఫైనాన్షియర్ పిటీషన్ నేపథ్యంలో మార్కుపురం మెజిస్ట్రేటు కోర్టు వీరికి పలుమార్లు న్యాయస్థానానికి హాజరుకావాల్సిందిగా సమన్లను పంపింది. అయితే వారు అందకు ప్రతికూలంగా స్పందించి న్యాయస్థానానికి హాజరుకాలేదు. దీంతో న్యాయస్థానం వారిపై వారెంట్లు జారీ చేసిందని, ఈ నేపథ్యంలో వారు కోర్టుకు హాజరుకావాల్సి వచ్చిందని తెలుస్తుంది. ఇక సుమంత్, సుప్రియలు కోర్టుకు రావడంతో వారెంట్లను రీకాల్ చేసిన న్యాయమూర్తి పఠాన్ షియాజ్, కేసును జూన్ 28కి వాయిదా వేశారు. కాగా, త్వరలోనే డబ్బు సర్దుబాటు చేస్తామని ఫైనాన్షియర్తో కూడా వారు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more