ప్రకృతి ప్రకోపం తమపై పంజా విసరడంతో.. రాజస్థాన్ లోని ఈశాన్య జిల్లాల ప్రజలు విలవిలలాడారు. ముంచుకొస్తున్న మృత్యువు తమ వాళ్లను కబళిస్తున్నా.. తమను తాము కాపాడుకునే ప్రయత్నంలో నిశ్చేష్టులగా మారారు. తమ కళ్లముందే తమ కుటుంబసభ్యులు, ఇరుగుపోరుగువారు అర్థనాధాలు పెడుతున్నా.. అదుకోలేని నిస్సహాయస్థితిలోకి నెట్టివేయబడ్డ తమ పరిస్థితిని దిగమింగుకోలేకపోతున్నారు. ప్రకృతి విలయం.. వలయంలా తమను చుట్టుముట్టగా.. సుమారు 30 మంది బలయ్యారు. వందమందికి పైగా క్షతగాత్రులయ్యారు.
రాజస్థాన్ ప్రకృతి ప్రకోపం ఇసుక తుపాను రూపంలో ప్రజలను కబళించింది. ఈ రాష్ట్రంలోని ఈశాన్య జిల్లాలైన భరత్ పూర్, ధోల్ పూర్, అల్వార్, శ్రీగంగానగర్ జిల్లాల్లో వాయువేగానికి ఇసుక కూడా తోడై దుమ్మెత్తిపోసింది. ఆకాశాన్ని దుమ్ము, ధూళి కమ్మేసింది. తీవ్రమైన గాలులతోపాటు దుమ్ము ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. బుధవారం అర్థరాత్రి తర్వాత అకస్మాత్తుగా వచ్చిన ఇసుక తుఫాన్ ఈశాన్య రాజస్థాన్ లో బీభత్సం సృష్టించింది. పెద్ద ఎత్తున ఇసుక ఇళ్లలోకి వచ్చింది. రోడ్లపై వాహనాల్లో వెళ్లే వారికి ముందు, వెనక ఏమీ కనిపించలేదు. గాలులతోపాటు ఇసుక వచ్చి పడుతుండటంతో ప్రమాదాలు జరిగాయి.
తీవ్రమైన గాలులకు విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. పెద్ద పెద్ద చెట్లు నేలకొరిగాయి. ఇసుక తుఫాన్ ధాటికి భరత్ పూర్ ఒక్క జిల్లాలోనే 11 మంది చనిపోయారు. కరెంట్ లేదు.. నీటి సరఫరా కూడా నిలిచిపోవటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అపార్ట్ మెంట్లలోకి కూడా దుమ్ము వచ్చి చేరింది. చిన్న చిన్న ఇళ్లు అయితే మట్టికొట్టుకుపోయాయి. హాటళ్లు, చిరు వ్యాపారులు అయితే ఈ ఇసుక తుఫాన్ దెబ్బకి తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం 22 మంది చనిపోయారని.. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. రాజస్థాన్ ప్రభుత్వం కూడా వెదర్ ఎమర్జెన్సీ ప్రకటించింది. మరో రెండు రోజులు ఇలాంటి ప్రకృతి విలయాలు ఉండొచ్చని.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more