జనసేన అధినేత పవన్ కల్యాణ్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్రంలో తమ పార్టీ తరపున జనసేన అధినేత, పవర్ స్టార్ ప్రచారం చేస్తారన్న వార్తలను స్వయంగా జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి ప్రకటించిన నేపథ్యంలో.. ఎప్పుడు వెళ్తారన్న విషయమై అక్కడి పవన్ అభిమానులు ఎదురుచూపులకు ఇక నిరాశ ఎదురవుతుంది. ఎందుకంటే ఆ రాష్ట్రంలో పర్యటించాలన్న అలోచనలకు ప్రస్తుతానికి పవన్ కల్యాన్ వెళ్లడం లేదని జనసేన స్పష్టం చేసింది.
తమ పార్టీని రెండు తెలుగు రాష్ట్రాలలో క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేసే కార్యక్రమాలలో పవన్ ప్రస్తుతం బిజీగా వున్నారని.. అదే లక్ష్యంగా పర్యటన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారని, ఈ క్రమంలో వచ్చిన కర్ణాటక ఎన్నికలలో అక్కడి వెళ్లి ప్రచారం చేయాలన్న అలోచనను జనసేన విరమించుకుందని ఆ పార్టీ వెల్లడించింది. వాస్తవానికి పవన్ కర్ణాటక పర్యటనపై ఆది నుంచి అనుమానాలే నెలకోన్నా.. తాజాగా జనసేన ఈ నిర్ణయాన్ని స్పష్టం చేయడంతో కర్ణాటకలోని ఆయన అభిమానులు పవన్ వస్తున్నాడని వేయికళ్లతో ఎదురుచూస్తున్నా.. తాజా నిర్ణయంతో వారి ఎదురుచూపులు ఫలించలేదు.
జేడీఎస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తారని ఒకసారి, ఎన్నికల బరిలో వున్న తమ స్నేహితులకు మాత్రమే పవన్ ప్రచారం చేస్తారని మరోమారు వార్తలు వచ్చినా.. జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి తమ ప్రచారంలో పవన్ ను కూడా స్టార్ ప్రచారకర్తగా పేర్కోన్న నేపథ్యంలో జనసేనాని వారి తరపున ప్రచారం చేస్తారన్న వార్తలకు బలం చేకూరింది. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న బీజేపీకి ఓట్లు వేయరాదని పవన్ కన్నడనాట ప్రచారం చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు డిమాండ్ చేసినా, పవన్ మాత్రం మౌనంగానే ఉండిపోయారు. కాగా, హోదా సాధన, విభజన హామీల అమలే లక్ష్యంగా ఈ నెల 11న తన కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తానని పవన్ కల్యాణ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more