తన మొగుడు తనకే సొంతం అని అనుకునే హక్కు, అధికారం భార్యలకు వున్నా.. తన భార్య తనకే సొంతం అనే హక్కు, అధికారాలు మాత్రం భర్తలు లేవు. కొట్టినా.. తిట్టినా..వంటింట్లోనే పడుండాలి.. గడప దాటి బయటకు వెళ్లకూడదన్న భర్తల అదేశాలు ఇకపై చెల్లవు.. నమ్మశక్యంగా లేదా... కానీ ఇది ముమ్మాటికీ నిజం. భర్తలకు షాకిచ్చేలా.. భర్తల నరనరాల్లో జీర్ణంచుకుపోయిన మగాడు, మొగుడు అన్న అహంకారం పటాపంచలయ్యేలా బహుచక్కగా స్పష్టం చేసింది దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. పురుషాధిక్య సమాజంలో మహిళలకు కూడా స్వేఛ్చను కల్పించింది.
భార్య అస్తి కాదు, వస్తువూ కాదు.. తనతోనే కలసి వుండాలని బలవంతం చేస్తే కూడా కదరదు అంటూ దేశఅత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇది భార్యలను వేధిస్తున్న భర్తలకు దిమ్మదిరిగే తీర్పు. అనునిత్యం వేధిస్తూన్న తన భర్తతో కలసి వుండలేనంటూ ఓ బాధిత మహిళ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తన భర్త తనతో కలిసి ఉండాలని కోరుకుంటున్నా.. తాను మాత్రం అతనితో కలసి అడుగులు వేయలేనని ఆమె కోర్టుకు తెలిపింది. అందుకు అతని నిత్యవేధింపులే కారణమని కూడా న్యాయస్థానం ఎదుట స్పష్టం చేసింది.
దీనిపై జస్టిస్ మదన్ బిలోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ... ‘‘ఆమె ఆస్తి కాదు. ఆమె నీతో కలసి జీవించాలనుకోవడం లేదు. మరీ ఆమెతో కలసి ఉండాలని ఎలా చెబుతావు?’’ అంటూ బాధితురాలి భర్తను ప్రశ్నలతో కడిగేసింది. ఆమె కలసి జీవించేందుకు ఇష్టంగా లేకపోవడంతో మరోసారి పునరాలోచించుకోవాలని కోర్టు సూచించింది. అయితే, ఆమెను ఒప్పించేందుకు అవకాశం ఇవ్వాలని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అదే సమయంలో విడాకులు ఇప్పించాలని బాధుతురాలి తరఫు న్యాయవాాది కోరారు. దీంతో ఈ కేసులో తదుపరి విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగస్టు నెల 8వ తేదీకి వాయిదా వేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more