ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఉద్యమాలు చేయాలన్నది తన ఉధ్దేశ్యం కాదని, అయితే అవిధంగా తనను ఉసిగొల్పుతున్నారని జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాన్ అన్నారు. తమ ఉధ్యమాల వల్ల సామాన్య ప్రజానికానికి ఎలాంటి అవరోధం కలగవద్దని యోచిస్తానని అయన అన్నారు. నాయకులు అమ్ముడుపోతారేమో, కానీ ప్రజలు, ప్రజా నాయకులు మాత్రం అమ్ముడుపోరని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఇవాళ తాము జరిపిన పాదయాత్ర కేవలం తొలి అడుగు మాత్రమేనని.. ఇప్పటికైనా కేంద్రం దిగిరాకపోతూ మలి అడుగులలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని మరింత తీవ్రవైన ఉద్యమాలను రూపొందిస్తామని చెప్పారు. రానున్న రెండు వారాల్లో మరిన్ని ప్రజాఉధ్యమాలు నిర్వహిస్తామని చెప్పారు.
రాష్ట్రానికి ప్రత్యేక హదాను కల్పించడంతో పాటు విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ.. వామపక్షాలతో కలసి తొలిసారి ప్రజాక్షేత్రంలోకి వచ్చి జాతీయ రహదారులపై శాంతియుతంగా పాదయాత్ర చేసిన జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాన్ విజయవాడలోని బెంజీ సర్కిల్ నుంచి రామవరప్పాడు వరకు ఆరు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఎన్నికల సమయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్న ప్రధాని, అధికారంలోకి వచ్చిన తరువాత హోదా విషయాన్నే మర్చిపోయారని అన్నారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చే నిధులనే మన రాష్ట్రానికి ఇచ్చి దాని పేరును మాత్రమే మార్చరని అన్నారు. విభజన హామీలు కేంద్రం అమలు చేస్తుందని కొన్నాళ్లు వేచిచూశామని అయినా ఫలితం లేకపోవడం వల్లే తాను ప్రశ్నించడం ప్రారంభించానని చెప్పారు.
కేంద్రం ఇచ్చించి పాచిపోయిన లడ్డూలని తాను అంటే.. హోదా కన్నా అవే మాకు ముద్దు అని ప్యాకేజీకి సీఎం చంద్రబాబు ఒప్పుకుని సమర్దించారని పవన్ విమర్శఇంచారు. ఇవాళ్ల మళ్లీ మాట మార్చి ప్రత్యేక హోదా అంటున్నారని విమర్శించారు. కేంద్రంపై పోరాడటంలో అధికార, ప్రతిపక్షాలు విఫలమయ్యాయని, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని పవన్ దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న అన్యాయంపై తిరుపతిలో జరిగిన పార్టీ సభలో తొలిసారిగా తానే మాట్లాడానని, ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు డిమాండ్ చేయాలని కూడా కోరానని పేర్కోన్నారు.
ప్రధాన ప్రతిపక్షం వైసీపీ సమర్థవంతమైన పాత్ర నిర్వహించలేకపోయిందని, వామపక్ష పార్టీలతో కలిసి జనసేన పోరాడుతోందని స్పష్టం చేశారు. విభజనతో నష్టపోయిన ఏపీకి సీనియర్ నాయకుడి అనుభవం కావాలనే తాను గత ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతిచ్చానని, అయితే దానివల్ల ఫలితం లేకపోయిందని అన్నారు. ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం అశించిన స్థాయిలో పని చేయడం లేదని విమర్శించారు. ఆయనది కేవలం ప్రాంతీయ అభివృద్ది మాత్రమేనని పవన్ విమర్శఇంచారు. ఏపీలో వెనుకబడిన జిల్లాలపై ఎవ్వరూ మాట్లాడడం లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరుద్ధ ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశాయని విమర్శించారు.
చంద్రబాబు నుంచి మళ్లి పిలుపు వచ్చింది
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై చర్చించేందుకు అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి తనకు, తన పార్టీకి మళ్లీ పిలుపు వచ్చిందని పవన్ కల్యాణ్ తెలిపారు. రెండేళ్ల క్రితం లేదంటే కనీసం ఒక ఏడాది క్రితం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే బాగుండేదని అన్నారు. ఇప్పుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం వల్ల.. ఏం లాభమో తనకు అర్థం కావడం లేదని, వెళ్లి కాఫీ, టీలు తాగి రావడం తప్ప ఏం చేస్తామని ప్రశ్నించారు.
కాబట్టి ముందు చంద్రబాబు నాయుడు తమ మంత్రులతో కూర్చొని ప్రణాళిక వేసుకోవాలని పవన్ కల్యాణ్ అన్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిశాయని, ఇక మున్ముందు పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకెళదామనుకుంటున్నారో చంద్రబాబు స్పష్టత తెచ్చుకోవాలని హితవు పలికారు. ఆ తరువాత వారి మనసులో ఏముందో తమకు తెలియజేస్తే, వారు పోరాడాలనుకుంటోన్న విధానంపై తాము యోచించి, వారితో కలిసి పోరాడతామా? లేదా? అనే విషయంపై తాము చెబుతామని అన్నారు. కాగా, తాము జేఎఫ్సీ నివేదిక రూపొందించిన కారణంగానే టీడీపీ, వైసీపీలపై ఒత్తిడి పెరిగిందని, పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం వరకు దారి తీసిందని పవన్ చెప్పుకొచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more