రాష్ట్రంలో తృతీయ ప్రత్యమ్నాయ పార్టీగా అవిర్భవించిన జనసేన.. ప్రత్యేక హోదా విషయంలో అటు కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వానికి తమ సెగను తాకేందుకు శాంతియుతంగా అందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ నెల 6న ఏపీలో పాదయాత్ర చేస్తామని, ముఖ్యంగా జాతీయ రహదారుల్లో, పలు ముఖ్య కూడళ్లలో నిర్వహిస్తామని పవన్ కల్యాణ్ చెప్పారు. పూర్తి శాంతియుత పద్ధతిలో ఢిల్లీని తాకే విధంగా నిరసన ఉంటుందని, ఈ పాదయాత్రలో జనసేన, సీపీఎం, సీపీఐ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొంటారని చెప్పారు. ఇక జనసేన సహా వామపక్షాల ముఖ్యనేతలు విజయవాడలోనే ఈ అందోళన కార్యక్రమాల్లో పాల్గోంటారని తెలిపారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశంలో కేంద్రం అన్యాయం చేస్తోందని పవన్ కల్యాణ్ అరోపించారు. కనీసం సభలో ఏపీ అధికార, విపక్షపార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాణాలపై చర్చకు రానీయకుండా వాయిదాలు వేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టని దుయ్యబట్టారు. సభాకార్యక్రమాలు సజావుగా సాగేలా చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరించడం కూడా వ్యవస్థకు ప్రమాదకరమని ఆయన అన్నారు.
అలాగే, ఇటీవల ఎస్సీ, ఎస్టీల వేధింపుల నిరోధక చట్ట సవరణ చేస్తోన్న నేపథ్యంలో నిర్వహించిన బంద్ లో 14 మంది మంది మృతి చెందడం, గాయాలపాలవడం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ చర్యను తాము ఖండిస్తున్నామని అన్నారు.
రాష్ట్రంలో రాష్ట్రీయ పార్టీలుగా అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు, అరోపణలు గుప్పించుకోవడంలో తప్పులేదని.. అయితే అదే హస్తినకు వెళ్లి కూడా కొనసాగించడం మంచి పరిణామం కాదని, ఇది రాష్ట్ర ప్రజలకు శాపంగా పరిణమిస్తుందని ఆయన అన్నారు. ఢిల్లీకి వెళ్లిన పార్టీల నేతలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకుండా పరస్పరం నిందలు వేసుకుంటున్నారని విమర్శించారు. సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 8న వామపక్షాలు బంద్ కు పిలుపు ఇవ్వకుంటే రాష్ట్రంలో ఇంత వేగంగా పరిణామాలు మారేవికాదన్నారు.
ఇక పవన్ కల్యాన్ కూడా అవిశ్వాసం పదం తీయకపోయుంటే.. ఏ పార్టీ దానిపై దృష్టి సారించేది కాదని అన్నారు. ఇవాళ దేశరాజకీయాలలో అంధ్రప్రదేశ్ అంశమే చర్చనీయాంశంగా మారిందని అన్నారు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపకపోవడం దారుణమని అన్నారు. కేంద్రం అవిశ్వాసానికి జంకి సభలను వాయిదా వేయించి పారిపోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని విమర్శఇంచారు. రాష్ట్ర ప్రయోజనాలపై పోరాడే క్రమంలో తాము దశల వారీగా ప్రణాళికలు ప్రకటిస్తామని చెప్పారు. ఏపీ అంట అమరావతి, పోలవరం అని చంద్రబాబు ప్రభుత్వం పేర్కోనడాన్ని తప్పబట్టిన రామకృష్ణ ఏపీ అంటే అనంతపురం టు పార్వతీపురం అని అన్నారు. ఇక అనంతపురంలో ఈ నెల 15న, ఒంగోలులో ఏప్రిల్ 24, విజయనగరంలో మే6న సదస్సులు, సభలు ఏర్పాటు చేస్తున్నామని, మేధావులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more