దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లు సామర్థ్యానికి మించి ఖైదీలతో కిక్కిరిసిపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల ప్రభుత్వాలపై అగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఖైదీల మానవ హక్కుల విషయంలో ఇంత అలసత్వమేంటని సూటిగా ప్రశ్నించింది. జైళ్లలో ఖైదీల రద్దీని తగ్గించేందుకు ప్రణాళికలను రూపొందించి వాటిని రెండు వారాల్లోగా నివేదించాలని అదేశాలను అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల జైళ్ల డైరెక్టర్ జనరళ్లను హెచ్చరించింది.
జైళ్ల నిర్దిష్ట సామర్థ్యానికి మించి 150 శాతం మేర అధికంగా ఖైదీలతో కిక్కిరిసిపోతున్న నేపథ్యంలో కోర్టు ఈ మేరకు కన్నెర్ర చేసింది. ఓ జైలులో ఏకంగా 609శాతం మేర అధికంగా ఖైదీలు వున్నారని తెలియడంతో సుప్రీం అవి బంజరదొడ్లుగా భావిస్తున్నారా.. అంటూ మండిపడింది. రెండు వారాల్లోగా జైళ్లలోని ఖైదీల సంఖ్యను తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో వెల్లడించాలని అదేశించిన అత్యున్నత న్యాయస్థాన దర్మాసనం.. అలా చేయని పక్షంలో జైళ్ల డీజీలు సుప్రీంకోర్టు అదేశాల ఉల్లంఘనలకు పాల్పడ్డారన్న కోణంలో విచారణను ఎదుర్కొవాల్సి వస్తుందని చెప్పింది.
ఖైదీల రద్దీని తగ్గించేందుకు తగిన ప్రణాళికను రూపొందించాలని మే 6, 2016లో జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ మిశ్రాలతో కూడిన సర్వోన్నత న్యాయస్థానం ద్విసభ్య ధర్మాసనం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అదేశాలను జారీ చేసింది. అయితే ఇందకు ఏ రాష్ట్రం నుంచి కూడా స్పందన రాకపోవడంతో ప్రభుత్వాల అలసత్వాన్ని ధర్మాసనం సీరియస్గా తీసుకుంది. రెండు వారాల్లోగా ఈ ప్రణాళికను రూపోందించని పక్షంలో కంటెప్ట్ అఫ్ కోర్టు కింద జైళ్ల డీజీలు విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
"ఇది అత్యంత దురదృష్టకరం. ఖైదీల మానవ హక్కుల విషయంలో రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల పూర్తిస్థాయి నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతోంది. అంతేకాక అండర్ ట్రయల్ సమీక్ష కమిటీలు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించడంలో వైఫల్యం చెందాయని స్పష్టమయింది" అంటూ ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. ఖైదీల మానవ హక్కులపై ఈ కేసులో సుప్రీంకోర్టుకి న్యాయ సలహాదారు (అమికస్ క్యూరీ)గా వ్యవహరిస్తున్న గౌరవ్ అగర్వాల్ సంధించిన ప్రశ్నకు రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ్ బెంగాల్, పంజాబ్, గోవా, మధ్యప్రదేశ్, అసోం, బీహార్ రాష్ట్రాలను ధర్మాసనం ఆదేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more