కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల తమ ప్రీ ఫోల్ సర్వేను బహిరంగపర్చిన ఓ ప్రైవేటు సంస్థ.. గతంలో కన్నా కాంగ్రెస్ ఈ సారి మెరుగైన ఫలితాలను అందుకుని మరోమారు అధికారంలోకి వస్తుందని వెల్లడించిన నేపథ్యంలో.. లేక తాము ఎంత ప్రచారం చేసినా.. ప్రజలు తమ వైపు అకర్షితులు కావడం లేదన్న అక్కస్సో కానీ.. మొత్తానికి బీజేపికి మాత్రం కర్ణాటక రాష్ట్రంలో ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇటీవల పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తన నోరు జారీ దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం ఎవరిదైనా వుందా.? అని ప్రశ్నిస్తే.. అది కేవలం యడ్యూరప్ప ప్రభుత్వమేనని ఓ న్యాయమూర్తి తనతో అన్నారని వ్యాఖ్యలు చేసి.. నాలుక కర్చుకున్నారు.
సరిగ్గా ఇది జరగి వారం రోజులు కూడా తిరిగీ తిరక్కముందే.. తమ అధిపత్యాన్ని ఎలాగైనా కొనసాగించి.. దక్షిణాదిలో కూడా మళ్లీ పాగా వేయాలని అశిస్తున్న బీజేపి వరుసగా చేధు అనుభవాలు ఎదురవుతున్నాయి. అమిత్ షా తరువాత ఆ పార్టీ ఎంపీ ప్రహల్లాద్ జోషి కూడా ఇదే విధంగా నాలుక కర్చుకున్నారు. అయితే అవి తన మాటలుగా కాకుండా.. పార్టీ అధక్షుడు అమిత్ షా వ్యాఖ్యలుగా అక్కడి ప్రజలకు అర్థమయ్యేలా చేశాడు. అదెలా అంటారా..? అయన ఇటీవల జరిగిన ర్యాలీలో అమిత్ షాకు అనువాదకుడిగా వున్నారు. అమిత్ షా హిందీలో మాట్లాడుతుండగా, దానిని కన్నడలో జోషి అనువదించారు.
దేవనగిరి జిల్లా చల్లకెరెలో నిర్వహించిన బీజేపీ ర్యాలీలో షా ప్రసంగాన్ని ప్రహ్లాద్ జోషీ అనువదిస్తూ.. ‘‘ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని సర్వనాశనం చేస్తారు. దళితులకు, పేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిందేమీ లేదు. దేశాన్ని ఆయన నాశనం చేయడం ఖాయం.. దయచేసి ఆయనకు ఓటు వేయండి’’ అని పేర్కొనడంతో షా సహా బీజేపీ నేతలు, ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. నిజానికి షా మాట్లాడుతూ.. ‘‘సిద్ధ రామయ్య ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు. మోదీపై మీకున్న అభిమానాన్ని యాడ్యురప్పకు ఓటేయడం ద్వారా చూపించండి. కర్ణాటకను దేశంలోనే గొప్ప రాష్ట్రంగా మారుస్తాం’’ అని పేర్కొన్నారు. అయితే అనువాదకుడి పొరపాటుతో ప్రజలు విస్తుపోయారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more