Class V minor child raped, burnt to death విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. సజీవదహనం

Class fifth student dies after being gandraped and then set on fire

assam girl gangrape, minor girl gangrape, minors, nagaon, student, fifth class student gangrape, Assamese girl gangraped by minors, Nagaon district, Nagaon Civil Hospital, Dhaniyabheti village gangrape, Lalung Gaon gangrape, india news, social news, latest news, crime news

The incident is reported from Assam's Nagaon district where the culprits which included two minors aged 10 and 11 set the minor girl child on fire after raping her. The girl's parents were at work when the crime took place.

తోటి విద్యార్థుల దారుణం: విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. సజీవదహనం

Posted: 03/24/2018 03:19 PM IST
Class fifth student dies after being gandraped and then set on fire

అక్కడెక్కడో సప్తసముద్రాల అవతల వున్న అగ్రరాజ్యంలో నేరప్రవృత్తి గురించి, అక్కడి గన్ కల్చర్ విషయమై మాట్లాడుకునే రోజులు పోయాయి. ఇప్పడు మన దేశ యువత గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది. యావత్ దేశాన్ని దిగ్బ్రాంతికి గురి చేసే అత్యంత దారుణ ఘటన మనదేశంలో చోటుచేసుకోవడమే ఇందుకు కారణం. మన బాలబాలికల్లో కూడా నేరప్రవృత్తి బాగా పెరిగిపోయిందని.. ఇది యావత్ దేశాన్ని అందోళనకు గురి చేస్తున్న అంశం. మన పిల్లలు ఏం చూస్తున్నారు..? ఏం అలోచిస్తున్నారు..? అన్న విషయాలపై తల్లిదండ్రులు నిత్యం పర్యవేక్షణ ఉంచాల్సిన అవసరం వచ్చింది.

ఇది పిల్లలకు స్వేచ్చ, స్వాతంత్ర్యాలకు విఘాతం కలిగించే అంశమని బాలబాలికల సంఘాలు గళమెత్తినా.. వారిని ఇప్పటి నుంచే సన్మార్గంలో నడిపించుకోవాల్సిన అవసరం మాత్రం తల్లిదండ్రులకు వుంది. స్వామి వివేకానంద లాంటి వాళ్లు మన దేశం గురించి ఎంతో గోప్పగా చెప్పిన సభికులు అసాంతం ప్రసంగాన్ని వినేలా చేసిన ఆ రోజులు పోయాయి. ఇప్పడంతా నేరమే రాజ్యమేలుతుందని అసోంలో జరిగిన దారుణ ఘటన తలపింపజేస్తుంది. అస్పోంలోని నాగావ్‌ జిల్లాలో ఐదో తరగతి చదువుతున్న ఓ బాలికపై ముగ్గురు మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డి.. విషయం బయటకు రాకుండా బాలిక ఒంటికి నిప్పంటించి సజీవదహనం చేశారు.

పోలీసుల కథనం ప్రకారం..నాగావ్ లోని లాలూన్ గావ్ గ్రామానికి చెందిన ఓ 12ఏళ్ల బాలిక స్థానిక పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. క్రితం రోజున సదరు బాలిక పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా, ఆమెతో పాటు అదే పాఠశాలలో చదువుతున్న ముగ్గురు బాలురు కూడా వచ్చారు. ఇంటికి చేరకున్న తరువాత ఇంట్లో ఎవరూ లేని విషయం గమనించి ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించి పారిపోయారు.

బాలిక అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు వెంటనే చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే 90శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న చిన్నారి చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందింది. చనిపోడానికి ముందు జరిగిన విషయాన్ని బాలిక పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఇద్దరిని పట్టుకున్నామని.. మూడో బాలుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. నిందితులపై జువైనల్‌ కేసు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape  gangrape  minors  Dhaniyabheti  nagaon district  assam  crime  

Other Articles