అక్కడెక్కడో సప్తసముద్రాల అవతల వున్న అగ్రరాజ్యంలో నేరప్రవృత్తి గురించి, అక్కడి గన్ కల్చర్ విషయమై మాట్లాడుకునే రోజులు పోయాయి. ఇప్పడు మన దేశ యువత గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది. యావత్ దేశాన్ని దిగ్బ్రాంతికి గురి చేసే అత్యంత దారుణ ఘటన మనదేశంలో చోటుచేసుకోవడమే ఇందుకు కారణం. మన బాలబాలికల్లో కూడా నేరప్రవృత్తి బాగా పెరిగిపోయిందని.. ఇది యావత్ దేశాన్ని అందోళనకు గురి చేస్తున్న అంశం. మన పిల్లలు ఏం చూస్తున్నారు..? ఏం అలోచిస్తున్నారు..? అన్న విషయాలపై తల్లిదండ్రులు నిత్యం పర్యవేక్షణ ఉంచాల్సిన అవసరం వచ్చింది.
ఇది పిల్లలకు స్వేచ్చ, స్వాతంత్ర్యాలకు విఘాతం కలిగించే అంశమని బాలబాలికల సంఘాలు గళమెత్తినా.. వారిని ఇప్పటి నుంచే సన్మార్గంలో నడిపించుకోవాల్సిన అవసరం మాత్రం తల్లిదండ్రులకు వుంది. స్వామి వివేకానంద లాంటి వాళ్లు మన దేశం గురించి ఎంతో గోప్పగా చెప్పిన సభికులు అసాంతం ప్రసంగాన్ని వినేలా చేసిన ఆ రోజులు పోయాయి. ఇప్పడంతా నేరమే రాజ్యమేలుతుందని అసోంలో జరిగిన దారుణ ఘటన తలపింపజేస్తుంది. అస్పోంలోని నాగావ్ జిల్లాలో ఐదో తరగతి చదువుతున్న ఓ బాలికపై ముగ్గురు మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డి.. విషయం బయటకు రాకుండా బాలిక ఒంటికి నిప్పంటించి సజీవదహనం చేశారు.
పోలీసుల కథనం ప్రకారం..నాగావ్ లోని లాలూన్ గావ్ గ్రామానికి చెందిన ఓ 12ఏళ్ల బాలిక స్థానిక పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. క్రితం రోజున సదరు బాలిక పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా, ఆమెతో పాటు అదే పాఠశాలలో చదువుతున్న ముగ్గురు బాలురు కూడా వచ్చారు. ఇంటికి చేరకున్న తరువాత ఇంట్లో ఎవరూ లేని విషయం గమనించి ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించి పారిపోయారు.
బాలిక అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు వెంటనే చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే 90శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న చిన్నారి చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందింది. చనిపోడానికి ముందు జరిగిన విషయాన్ని బాలిక పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఇద్దరిని పట్టుకున్నామని.. మూడో బాలుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. నిందితులపై జువైనల్ కేసు నమోదు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more