బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మెడకు బిగుసుకున్న దాణా కుంభకోణంలోని నాలుగో కేసులో ఆయనకు మరో ఏడేళ్ల జైలు శిక్ష పడింది. దీంతో మొత్తంగా ఆయనకు 14 ఏళ్ల శిక్ష పడింది. దుమ్కాకు సంబంధించిన ఈ కేసులో ఆయనను దోషిగా నిర్ధారించిన రాంచీ సీబిై ప్రత్యేక న్యాయస్థానం సొమవారం రోజున తీర్పును వెలువరించగా, ఇవాళ ఈ నాలుగో కేసుకు సంబంధించిన శిక్షను ఖరారు చేసింది. దీంతో పాటు రూ.60 లక్షల జరిమానాను కూడా విధించింది.
కాగా, దాణా కుంభకోణానికి సంబంధించి ఇదివరకే తీర్పును వెల్లడించిన న్యాయస్థానం గత మూడు కేసుల్లోనూ ఆయనను దోషిగా నిర్ధారించిన రాంచీ ప్రత్యేక కోర్టు ఆయనకు శిక్షను విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన జైలు శిక్షను అనుభవిస్తున్నారు. రూ. 3.18కోట్ల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన ఈ కేసులో నాటి ముఖ్యమంత్రి లాలూ సహా మొత్తం 19 మందికి ఇవాళ శిక్షలు ఖరారు చేసింది. లాలూకి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.30 లక్షల జరిమానా విధించింది. కాగా, ఇదే కేసులో బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా సహా మొత్తం 12 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
2013లో మొదటి కేసులో ఆయన దోషిగా రుజువుకావడంతో ఐదేళ్ల జైలు శిక్ష పడింది. గతేడాది డిసెంబర్ 23న రెండో కేసులోనూ అక్రమాలకు పాల్పడినట్టు తేలడంతో ధర్మాసనం మూడున్నరేళ్ల కారాగార శిక్ష విధించింది. ఇక జనవరి 24న మూడోకేసుపై వెలువడిన తీర్పులో లాలూకి ఐదేళ్ల జైలు శిక్ష ఖరారైంది. తాజాగా ఏడేళ్ల జైలు శిక్ష పడడంతో లాలూకి మొత్తం 20 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష పడినట్టైంది. ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీలోని బిస్రా ముండా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more