రైలు ప్రయాణికులకు మరో తీపికబరును అందించింది రై్ల్వే శాఖ. ఇటీవలే ప్రైవేటు క్యాబ్ సంస్థ ఓలాతో కుదుర్చకున్న ఒప్పందం మేరకు ఐఆర్సీటీసీ ద్వారా బుక్ చేసుకున్న టికెట్లదారులకు ఇంటివరకు ఉచితంగా దిగబెట్టే సదుపాయం కల్పించే పైలెట్ ప్రాజెక్టుకు అందుబాటులోకి తీసుకువచ్చిన రైల్వేశాఖ.. ఇక మరో గుడ్ న్యూస్ ను కూడా అందించింది. రైలు ప్రయాణికుల ఆకలి తీర్చేందుకు జారీ చేసిన క్యాటరింగ్ లైసెన్సులను సదరు కాంట్రాక్టర్లు. కేవలం ధనార్జనకే వినియోగించి.. అక్రమాలకు పాల్పడుతూ.. అధిక చార్జీలు వసూలు చేస్తున్నారన్న అరోపణల అధికంగా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రైల్వే కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. తాజాగా అమల్లోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం.. రైళ్లలో ఏదేని అహారపదార్థాలను విక్రయించిన క్యాటరర్లు తప్పని సరిగా వారు విక్రయించిన వస్తువుకు సంబంధించిన బిల్లును ఇవ్వాలన్న నిబంధనను అమల్లోకి తీసుకురానున్నారు. రైళ్లలో ప్రయాణికులకు అందించే భోజనం, టిఫిన్, ఇతర తినుబండారాలు, కాఫీ, టీ, శీతల పానీయాలకు సంబంధించి కేటరర్లు విధిగా రసీదు ఇవ్వాలన్న నిబంధనను తెస్తున్నారు.
ఇక తాజా నిబంధనల ప్రకారం బిల్లు ఇవ్వని క్యాటరర్లకు ప్రయాణికులు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ‘నో బిల్.. ఫ్రీ ఫుడ్’ పేరుతో ఈ నెలాఖరులోగా కొత్త పాలసీని అమలు చేయాలంటూ రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే భారతీయ రైల్వే కేటరింగ్, పర్యాటక సంస్థ (ఐఆర్సీటీసీ) తన వెబ్సైట్లో కొత్త పాలసీ వివరాలను అందుబాటులో ఉంచింది. ఈ విషయంపై ప్రయాణికులను చైతన్యపరుస్తోంది. మరోవైపు తమ ఇన్స్పెక్టర్లను రైళ్లలో నియమించి, కేటరర్లు ప్రయాణికులకు రసీదులు జారీ చేసేలా చర్యలు తీసుకుంటోంది. అధిక చార్జీలు, రసీదు ఇవ్వడానికి ఫుడ్ సర్వర్లు నిరాకరించడంపై ఏడు వేలకు పైగా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో.. రైల్వే మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more