ప్రయాణికులకు రైల్వే బ్రహ్మాండమైన శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు రైల్వే టికెట్లు బుక్ చేసుకుని ఆ సమయానికి ముందే స్టేషన్ కు చేరుకునేందుకు ట్రాపిక్ అవాంతరాలను అడ్డంకులను దాటుకుని వెళ్లాల్సి వచ్చిన ప్రయాణికులకు రైల్వే ఊరటను కల్పిస్తుంది. ఈ పోటీలో ఒక్కసారి సమయం దాటిపోయి రైలు ఫ్లాట్ పారమ్ నుంచి వెళ్లిపోవడంతో నిరాశగా తిరుగుముఖం పట్టే ప్రయాణికుల సంఖ్యకూడా అంచనాలకు మించే వుండగా అవే అనుభవాలు పునరావృతం కాకూడదని ముందస్తు జాగ్రత్లు తీసుకుంటున్నారు.
అయితే ఇక్కడ మరో విషయం కూడా వుంది. పర్యటనలు చేసి చేత్తుల్లో బొలడెంత లగ్యేజీతో రైల్వేస్టేషన్ వద్ద దిగే ప్రయాణికుకులకు కేూడా రైల్వే శుభవార్తను అందించింది. ఇన్నాళ్లు రైలు దిగి స్టేషన్ బయటకు వెళ్లగానే టాక్సీలు, అటోవాలాల రేట్లు చూసి బిత్తరపోయే ప్రయాణికులకు ఇకపై ఊరట లభించేలా రేల్వేశాఖ నిర్ణయం తీసుకుంటుంది. ఐఆర్సీటీసీ ద్వారా టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికులను ఇక నేరుగా వారి ఇంటి దగ్గరే దించనుంది.
అది కూడా ఉచితంగా. ఇందుకోసం ఓలా క్యాబ్ తో ఐఆర్సీటీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా ఆరు నెలలపాటు ఈ సేవలను ప్రయోగాత్మకంగా అందించనున్నారు. ప్రయాణానికి ఏడు రోజుల ముందే ప్రయాణికులు తమ గమ్యస్థానాలను చేరుకునేందుకు క్యాబ్ను బుక్ చేసుకోవచ్చు. అది కూడా మనకు కావాల్సిన కారును బుక్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. మైక్రో, మినీ, ప్రైమ్ సెడాన్, ప్రైమ్ ప్లే, ఆటో, షేర్.. ఇలా మనకు కావాల్సిన దానిని బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది.
అయితే క్యాబ్స్ ఇందుకోసం అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ఐఆర్సీటీసీ యాప్, వెబ్సైట్కు లాగిన్ అయి ‘బుక్ ఎ క్యాబ్’ అనే ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. స్టేషన్లో దిగిన వెంటనే క్యాబ్ సిద్ధంగా ఉంటుంది. రైలెక్కిన ప్రయాణికులు క్షేమంగా, సౌకర్యవంతంగా ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశంతోనే ఓలా క్యాబ్ తో ఈ ఒప్పందం చేసుకున్నట్టు ఐఆర్సీటీసీ తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more