సామాన్యుల హక్కుగా పేర్కోంటూ.. ఆధార్ కార్డును అన్ని సేవలకు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఊరటను కల్పించింది. బ్యాంకు అకౌంట్లు, మోబైల్ ఫోన్, ఇన్సూరెన్స్ పాలసీలు, ఇలా అన్ని సామాజిక సేవలతో పాటు గ్యాస్ సబ్బీడి సహా అన్ని సేవలకు ఆధార్ ను అనుసంధానం చేయడంతో సామాన్యుడు అన్ని కార్యాలయాల చుట్టూ.. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ బిజీగా మారాడు. అందులోనూ మార్చి 31తో డెడ్ లైన్ ముగుస్తుందన్న నేపథ్యంలో ఆధార్ జిరాక్సులు తీసుకెళ్లి అన్నింటికీ అనుసంధానం చేయడంలో నిమగ్నమయ్యాడు.
కాగా ఇవాళ ఆధార్ దేశ పౌరుల వ్యక్తిగత భద్రతా హక్కు అని గత కొంతకాలం క్రితం తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన దేశ సర్వోన్నత న్యాయస్థానం ధర్మసనం తీర్పును వెలువరించింది. కాగా ఆధార్ నెంబర్ ను అన్ని సేవలతో అనుసంధానం తప్పనిసరి చేస్తున్న నేపథ్యంలో దాఖలైన పిటీషన్లపై విచారణ కొనసాగిస్తున్న ఐదుగురు సభ్యుల గల దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ధర్మాసనం.. మార్చి 31 అంటూ సాగుతున్న ప్రచారంపై స్పష్టతను వెలువరించింది. తమ ధర్మాసనం తుది తీర్పు ఇచ్చేంత వరకు ఎలాంటి డెడ్ లైన్ వుండబోదని తేల్చిచెప్పింది.
ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనానికి నేతృత్వం వహించిన సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా వెల్లడించారు. తాము తీర్పును వెలువరించే వరకు ఎలాంటి డెడ్ లైన్లు వుండవని అన్నారు. అధార్ తప్పని సరి అంటూ కేంద్ర ప్రభుత్వం బలవంతంగా పౌరులను అందోళనకు గురి చేయడం సముచితం కాదని పేర్కోన్నారు. దీంతో ఆధార్ అనుసంధానానికి తమ తీర్పు వెలువరించిన తేదీనే తుది గడువును వెల్లడించడమా..? లేక మరేంటా అన్న నిర్ణయం తీసుకుంటామని సీజేఐ చెప్పారు. అప్పటి వరకు దేశపౌరులు ఎలాంటి అందోళనకు గురికావాల్సిన అవసరం లేదని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more