నేపాల్ రాజధాని ఖాట్మాండులో శివారల్లో క్రితం రోజు మధ్యాహ్నం విమానం కుప్పకూలపోవడానికి, 49 మంది ప్రయాణికులు సజీవ దహనం కావడానికి పైలట్ నిర్లక్ష్యమే కారణమని తేలింది. ప్రాథమిక ధర్యాప్తును పూర్తి చేసిన అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా సివిల్ ఏమియేషన్ అథారిటీ అఫ్ నేపాల్ డైరెక్టర్ జనరల్ సంజీబ్ గౌతమ్ వివరాలను వెల్లడిస్తూ.. గడచిన 25 సంవత్సరాల్లో నేపాల్ లో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదం ఇదేనని.. దీనికి కారణం కూడా పైలట్ నిర్లక్ష్యమేనని తెలిపారు.
విమానాశ్రయంలో సక్రమంగా ల్యాండింగ్ చేయకపోవడం వల్లే విమానం అదుపు తప్పి పక్కనున్న పంటపోలాల్లోకి వెళ్లిందని, దీంతో వెనువెంటనే మంటలు అంటుకుని ఘోర ప్రమాదం సంభవించిందని అన్నారు. విమానాశ్రాయం ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు విమానాన్ని దక్షిణపు వైపు నుంచి ల్యాండ్ అయ్యేందుకు పైలట్ కు అనుతి ఇచ్చారని, అయితే దానిని లక్ష్యపెట్టకుండా పైలట్ ఉత్తరం వైపు నుంచి ల్యాండింగ్ కు ప్రయత్నించడంతోనే ల్యాండింగ్ క్రమంలో ప్రమాదం సంభవించిందిని గౌతమ్ తెలిపారు. అయితే కనీసం విమానాన్ని ఉత్తరం వైపు నుంచి ల్యాండింగ్ చేస్తున్న క్రమంలో పైలట్ కనీసం ఎమర్జెన్సీ ల్యాండింగ్ సంకేతాలను కూడా అందించలేదని గౌతమ్ స్పష్టం చేశారు.
డని కాగా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 22 మందిని విమాన సహాయ సిబ్బంది రక్షించి ఖట్మాండులోని వివిధ అస్పత్రులలో చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదం సంభవించిన సమయంలో విమానంలో మొత్తం 67 మంది ప్రయాణికులు విమానంలో వుండగా, వారిలో 37 మంది పురుషులు, 28 మంది మహిళలు, ఇద్దరు చిన్నారు వున్నారని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. కాగా వీరిలో 33 మంది నేపాలీ జాతీయులు కాగా, 32 మంది బంగ్లాదేశీయులని, ఒకరు చైనా, మరోకరు మాల్దీవ్ జాతీయులని అధికారులు తెలిపారు. కాగా క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వం అదేశాలను జారీ చేసిందని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more