రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా శరవేగంగా అడుగులు వేస్తోందని గవర్నర్ ఈఎస్ఎన్ నరసింహన్ అశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర 2018-19 బడ్జెట్ సమావేశాల తొలిరోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తూ.. గడిచిన మూడున్నరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం అనేక సవాళ్లను అధిగమించిందని అన్నారు. ఎన్ని అడ్డుంకులు ఎదురైనా అభివృద్ది పట్ల కృతనిశ్చయంతో ముందుకు సాగుతుందని అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టు రాష్ట్రానికి వరప్రదాయినిగా మారనుందని అన్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో అటు వ్యవసాయానికి, ఇటు గృహావసరాలకు, మరోవైపు పారిశ్రామిక రంగానికి 24 గంటలూ కోతల్లేని విద్యుత్ ను అందిస్తూ ముందుకు సాగడం దేశంలోనే అదర్శవంతంగా అవతరించిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు శరవేగంగా సాగుతున్నాయని నరసింహన్ వెల్లడించారు. అన్ని వర్గాల ఆర్థిక ప్రగతిపై దృష్టి పెట్టిన తన ప్రభుత్వం, గొర్రెల పంపిణీ పథకాన్ని విజయవంతం చేసిందని అన్నారు.
కాగా గవర్నర్ ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. గవర్నర్ తన ప్రసంగంలో అనర్గళంగా అబద్దాలను వెల్లవేయడాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ సభ్యులు.. అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ స్థానాల్లో లేచి నిలబడి నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గీతారెడ్డి తదితర సభ్యులు చేస్తున్న నినాదాల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయినా గవర్నర్ తన ప్రసంగం వేగాన్ని పెంచడంతో.. పోడియం వైపు దూసుకువచ్చిన కాంగ్రెస్ సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో సభలో మరింత గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more