TDP Thugs Party Says BJP Leader Vishnu Kumar Raju | హత్యలు చేసే వారికి, గూండాలకు టీడీపీలో పదవులిచ్చారు

Vishnu kumar raju sensational comments on tdp

BJP Leader, Vishnu Kumar Raju, TDP Leaders, Thugs Party, Insults Modi, AP Special Status, TDP Rowdies Party

BJLP Vishnu Kumar Raju Fires On TDP. TDP Leaders Are Rowdies, Says Vishnu Kumar Raju.

టీడీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు

Posted: 03/06/2018 12:43 PM IST
Vishnu kumar raju sensational comments on tdp

బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు తెలుగు దేశం పార్టీపై నిప్పులు చెరిగారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉంది కాబట్టే మిత్రధర్మాన్ని పాటిస్తూ ఓర్పు వహిస్తున్నామని, కానీ, టీడీపీ మాత్రం ఆపని చేయడం లేదని విష్ణుకుమార్ నిప్పులు చెరిగారు. ఈ ఉదయం వెలగపూడిలో మీడియాతో మాట్లాడిన ఆయన, మాట్లాడుతూ... తాము నోరు తెరిస్తే చాలా విషయాలు చెప్పాల్సి వస్తుందని, పరిస్థితి అంతదూరం రానీయకుండా తన నేతలను చంద్రబాబు కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. దేశాభివృద్ధికి ప్రధాని ఎంతో కృషి చేస్తుంటే, ఈ తరహా విమర్శలు సరికాదని హితవు పలికారు.

విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇప్పటికే ఎంతో సాయం అందిందని, ఏపీకి ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని అన్నారు. తామూ లెక్కలు తీయగలమని, చాలా అంశాలపై తమ వద్ద సమాచారం ఉందని ఆయన అన్నారు. టీడీపీలో గూండాలు, రౌడీలకు మాత్రమే పదవులు ఇస్తున్నారంటూ ఏపీ బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రూ. 5 లక్షల కోసం హత్యలకు పాల్పడేవారిని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. రూ. 10 లక్షలు ఇస్తే తనను కూడా హత్య చేస్తారని అన్నారు. గవర్నర్ ప్రసంగానికి డుమ్మాకొట్టి... నిరసన కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. ఎమ్మెల్యే వాసుపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

హత్యకేసులో నేరస్తుడైన వ్యక్తి... ప్రధానమంత్రికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తాడా అంటూ మండిపడ్డారు. టీడీపీ నేతలు మోదీని నిత్యమూ తూలనాడుతుంటే, చంద్రబాబు చూస్తూ ఊరకున్నారని అన్నారు. కాగా, నిన్న విశాఖలో ఎమ్మెల్యే వాసుపల్లి రైలు ఆకృతిలో ప్లెక్సీలు తయారు చేయించి, వాటి మధ్య నిలబడి, 'మోదీ మెడలు వంచుతాం' అంటూ వినూత్న నిరసన నిర్వహించిన సంగతి తెలిసిందే. 

టీడీపీ నేతల కౌంటర్...

ఈ ఉదయం మీడియా ముందుకు వచ్చిన బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు, సీఎం చంద్రబాబుపై విమర్శలతో విరుచుకుపడగా, టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. విష్ణు వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పిన టీడీపీ ఎమ్మెల్యే ఆంజనేయులు, చంద్రబాబును ఓ మాట అనేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని హితవు పలికారు. బీజేపీ నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే కేంద్రంతో మాట్లాడి విభజన హామీలను అమలు చేయించాలని, అది వదిలేసి న్యాయమైన కోరికలను తీర్చాలని అడుగుతున్న టీడీపీని విమర్శించడం ఏంటని ప్రశ్నించారు.

బీజేపీ నేతలు తమ వైఖరిని మార్చుకుని కేంద్రంపై ఒత్తిడిని పెంచేందుకు సహకరించాలని, లేకుంటే వారికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. పార్లమెంట్ లో వైసీపీ చేస్తున్న పోరాటంలో చిత్తశుద్ధి ఎంతమాత్రమూ లేదని వ్యాఖ్యానించిన ఆంజనేయులు, జగన్ కేవలం అధికారం కోసమే పాదయాత్ర చేస్తున్నాడని, ఆయన కోరిక నెరవేరే పరిస్థితి లేదని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles