కేంద్ర ప్రభుత్వంతో ఖయ్యం పెట్టుకుని సాధించేది ఏమీలేదని, అందుచేత మంచిగా వుండి రాష్ట్రాభివృద్దికి నిధులు తెచ్చుకోవాలన్నదే తమ ముఖ్యఉద్దేశమని గత మూడున్నరేళ్లుగా చెబుతూ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్నికల సమయంలో కేంద్రానికి ఎదురుతిరగడం అంతా నాటకమని వైసీపీ నేతలు విమర్శలను తోసిపుచ్చేందుకు రంగంలోకి దిగిన మంత్రి అధినారాయణ రెడ్డి.. ఏపీ ప్రత్యేక హోదా, సమస్యలు పరిష్కర్కరం కోసం కేంద్రప్రభుత్వం నుంచి వైదొలగాన్న వైసీపీ డిమాండ్ ను స్వీకరిస్తున్నామని అదినారాయణ రెడ్డి సవాల్ స్వీకరించారు.
కేంద్రం ఇలాగే వ్యవహరిస్తే వైసీపీ ఎంపీల కంటే నెల రోజుల ముందుగానే తమ ఎంపీలు కేంద్రప్రభుత్వం నుంచి వైదొలుగుతారని కూడా స్పష్టం చేశారు. కేంద్రానికి మార్చి 5 డెడ్ లైన్ విధిస్తున్నామని, ఈలోగా సమస్యలు పరిష్కరించకుంటే తమ ఎంపీలు రాజీనామా చేస్తారంటూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆయనతో విభేదించారు. అవి ఆదినారాయణరెడ్డి వ్యక్తిగత వ్యాఖ్యలని అన్నారు. ఇంతలోనే అదినారాయణ రెడ్డి మరోమారు మీడియా ముందుకు వచ్చి తన వ్యాఖ్యల నుంచి యూ-టార్న్ తీసుకున్నారు.
‘ఈ వ్యాఖ్యలు కేవలం నా వ్యక్తిగతం. పార్టీ తీసుకున్న నిర్ణయం కాదు. జగన్ ని దృష్టిలో పెట్టుకుని నేను ఈ వ్యాఖ్యలు చేయలేదు. మా పరిస్థితిని బట్టి నా వ్యక్తిగతంగా లెక్కలేసుకుని చెప్పిన మాట. ఈ విధంగా చెబితే మాకు పట్టుదల ఉంటుంది! కేంద్ర బడ్జెట్ లో ఏపీకి న్యాయం జరగలేదు. ఈ బడ్జెట్ పై సుదీర్ఘ చర్చ మార్చి 5న జరుగుతుంది కనుక, ఆ రోజున మా పార్టీ ఎంపీలు బయటకొస్తే బాగుంటుందని, కేంద్రం కూడా పరిశీలిస్తుందనే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశాను. నా వ్యక్తిగత అభిప్రాయం కిందే ఈ వ్యాఖ్యలు చేశాను. సీఎం గారు మాతో అన్న మాటలు కావు ఇవి. ఫలానా వ్యాఖ్యలు చెయ్యమని, చెయ్యొద్దని.. ఉపసంహరించుకోమని పార్టీ ఎప్పుడూ డైరెక్షన్ ఇవ్వదు. ప్రజాస్వామ్య పద్ధతిలో నేను వ్యక్తం చేసిన నా సొంత అభిప్రాయం ఇది’ అని చెప్పుకొచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more