పరీక్షలంటే ఓ కొలమానం. అందులో ఉత్తీర్ణలు అయితేనే విద్యార్ధులు అపై చదువులకు అర్హత సాధిస్తారు. ఇలాంటి పరీక్షలలో ఉత్తీర్ణులయ్యేందుకు విద్యార్థులు ఎంతో కష్టపడతారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు చెప్పిందే కాకుండా సాయంత్రం వేళ ట్యూషన్లు వెళ్లి మరీ నేర్చేసుకుంటారు. ఇక మరికొందరు మాత్రం ఏకంగా పరీక్షలు సమీపించిన సమయాల్లో రాత్రింబవళ్లు చదువులకే పరిమితం అవుతారు. తొమ్మిదినెలలు కష్టపడింది ఇందోకోసమేనంటూ అరోగ్యం సరిగా లేకున్నా పరీక్షలకు హాజరవుతారు.
అయితే సందెంట్లో సడేమియాలు మాత్రం ఇవేమి పట్టకుండా పరీక్షల్లో ఎలా పాస్ కావాలన్న దానిపైన మాత్రమే ద్యాసపెడతారు. అంటే కాపీయింగ్ అన్నమాట. కుదిరితే మాస్ కాపియింగ్ లేదంటే సెల్ప్ కాపీయింగ్. అయితే ఇలాంటి వారి సంఖ్య రోజురోజుకీ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా విమర్శలను ఎదుర్కొవా్లసిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో కాపీయింగ్ కేటగాళ్ల అటలు సాగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ విద్యాశాఖాధికారుల తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 5 లక్షల మంది విద్యార్థులు తొలి రెండు పరీక్షలకు డుమ్మాకొట్టారంటే ఆ వ్యూహం వారికి ఎంతగా షాకిచ్చిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఉత్తర్ ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి దినేశ్ శర్మ పదోతరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆదేశాలు జారీ చేయడమే కాకుండా వాటిని అమలు పరిచారా? లేదా? అన్నది నిర్ధారించుకునేందుకు పరీక్షా కేంద్రాల వద్దకు హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్నారు.
అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఆయన పర్యటనలో భాగంగా సిసీ కెమెరాల ఏర్పాటన్లను కూడా పరిశీలించారు. ఇక పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాసే గదుల్లో కూడా సీసీ కెమెరాలు అమర్చడంతో.. కాఫీకొట్టడానికి నిఘానేత్రాలు అడ్డుగా మారాయి. దీంతో విద్యార్ధులు షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలో మొత్తంగా పది, ఇంటర్ పరీక్షలకు 66 లక్షల మంది విద్యార్థులు హాజరుకావాల్సి వుండగా, వారిలో ఐదు లక్ష్లల మంది గైర్హాజరయ్యారు. ఇక మరిన్నీ పరీక్షలు మిగిలివుండటంతో మరెందరో విద్యార్థులు కూడా గైర్హాజరు కావచ్చునని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more