రాష్ట్ర విభజనతో తీవ్ర అన్యాయానికి గురైన అంధ్రప్రదేశ్ కు న్యాయం జరుగుతుందని అశించి, న్యాయం చేస్తారని అక్కడ బిజేపి, ఇక్కడ టీడీపీకి మద్దతుగా ప్రచారం చేశానని సినీనటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ అన్నారు. విభజన సమయంలో యూపీఏ ప్రభుత్వం ఏపీకి న్యాయం చేయలేదన్న కారణంతో.. ప్రజల సమస్యలు తీర్చుతారని, అపారమైన రాజకీయ అనుభవం ఉన్న నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడులను సమర్థించానని చెప్పారు.
అయితే నాలుగేళ్లు గడుస్తున్నా విభజన చట్టం హామీల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భిన్న వాదనలు చెబుతున్నాయని, ఇందులో కొన్ని అబద్దాలు కూడా వున్నాయని పవన్ కల్యాన్ విమర్శించారు. ఎన్నిక కాగానే వెంటపడితే బాగోదని, ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత ఏడాదిన్నర కాలం ఎంతో సంయమనంతో వున్నానని, ఆ తరువాత కూడా ప్రత్యేక హోదా గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదని తెలుసుకున్నానని తెలిపారు. దీంతో ప్రత్యేక హోదాపై తాను గళమిప్పానని చెప్పారు.
తిరుపతి, కాకినాడల్లో సభల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించానని ఆ తరువాత కొన్ని రోజులకు ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అన్నారని తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీతో రాష్ట్రానికి అధిక లాభమని తొలుత వాదించిన టీడీపీ నేతలు.. కాలం గడుస్తున్న కొద్ది ఒకసారి బాగుందంటారు, ఒకసారి బాగోలేదని అంటారని విమర్శించారు. ఇలా మాటలతో చాలా తికమక చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం పోతోందని చెప్పారు. విభజన సమయంలో ఏయే హామీలు ఇచ్చారో అవేవీ చేయడం లేదని అన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
కేంద్ర బడ్జెట్ లో ఏపీ వాటా ఎంత.?
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ రూ.24 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత? అని పవన్ కల్యాన్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ఏపీకి ఇచ్చిన నిధులపై కూడా స్పష్టత లేదని విమర్శించారు. నవ్యాంధ్రప్రదేశ్ గురించి సరిగ్గా పట్టించుకోలేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఏర్పాటుకు రాజకీయ జేఏసీ ఏర్పడినట్లుగా అంధ్రప్రదేశ్ లో కూడా ప్రత్యేక హోదా కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి ఉద్యమించాల్సిన అవసరం వుందని అన్నారు.
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలకు హామీలు ఇచ్చినప్పుడు వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని చెప్పారు. హామీలను విస్మరించడం పాలకులకు సముచితం కాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పట్లో పార్లమెంటులో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారని, దానిని అమలు చేయాల్సిన బాధ్యత ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వంపై వుందని పవన్ అన్నారు. కానీ ఇప్పటికీ చట్టంలోని అనేక హామీలు అమలుకావడం లేదని పవన్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more