రాజధాని లేని రాష్ట్రంగా సరిగ్గా మూడున్నరేళ్ల క్రితం నిలిచిన నవ్యాంద్రప్రదేశ్ అభివృద్దిలో శరవేగంగా దూసుకుపోతుంది. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేసి ఏకంగా సచివాలయం, అసెంబ్లీలను కూడా తాత్కాలిక ప్రాతిపదికన నిర్మించుకున్న రాష్ట్రం.. ఇక అమరావతికి అత్యంత చేరువలోని గన్నవరం విమానాశ్రయం అభివృద్దిపై కూడా దృష్టిసారించింది. గన్నవరం నుంచి దేశీయ విమానసర్వీసులు మాత్రమే వుండగా ఇక అంతర్జాతీయ సర్వీసులకు కూడా శుక్రవారం నుంచి అతిథ్యమివ్వనుంది.
అమరావతి వాసుల స్వప్నాన్ని సాకారం చేస్తూ.. ఇక్కడి నుంచి తొలి అంతర్జాతీయ సర్వీసు రేపు ప్రారంభం కానుంది. ప్రభుత్వ రంగ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ద్వారా ఈ సర్వీసు ప్రారంభం కానుంది. విజయవాడ టు దుబాయ్ వయా ముంబై గా ఈ సర్వీసు ప్రారంభం కానుంది. ఈ తొలి సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు గన్నవరం విమానాశ్రయంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు.
దుబాయ్, సౌదీలకు ఈ విమానం నడుస్తుంది. విజయవాడలో ఇప్పటికే ఇమిగ్రేషన్, కస్టమ్స్ విభాగాలు ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ విమానం ఉదయం 8 గంటలకు ముంబై నుంచి బయలుదేరి 9.45కు విజయవాడకు వచ్చి, ఆపై ఉదయం 10.30కి బయలుదేరి ముంబై మీదుగా దుబాయ్, సౌదీలకు వెళుతుంది. ముంబైకి అక్కడి నుంచి యూఏఈకి వెళ్లే సౌకర్యాన్ని కల్పిస్తున్న ఈ విమానానికి మంచి ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు.
కాగా, గన్నవరం విమానాశ్రయంలో మొత్తంగా పది కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇకపై ఐదు కౌంటర్లు అరైవల్ కోసం వినియోగిస్తుండగా, మరో ఐదింటిని మాత్రం డిపార్చర్ కోసం వినియోగించనున్నారు. ప్రైవేటు విమాన సంస్థలు ఇంటర్నేషనల్ సర్వీసులను విజయవాడ నుంచి ప్రారంభించేందుకు సాహసం చేయలేకపోతున్న వేళ, ఎయిర్ ఇండియా ముందుకు రావడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more