తన సోదరి ప్రముఖ పాత్రికేయురాలు, సామాజిక కార్యకర్త గౌరీ లంకేష్ హత్య విషయంలో ప్రధాని నరేంద్రమోడీ మౌనాన్ని వీడాలని డిమాండ్ చేస్తూ ట్విట్ చేసిన దక్షిణాది ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్.. మరో మారు బీజేపిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని సిర్సిలో జరిగిన 'మన రాజ్యాంగం, మన గౌరవం' అనే కార్యక్రమంలో ఆయన పాల్గొని.. తన ప్రసంగంలో భాగంగా ఉత్తర కన్నడ ఎంపీ, కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డేపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలకు కౌంటర్ గా సంక్రాంతి రోజున బీజేపీ యువనేతలు వేదికను గోమూత్రంతో శుద్ధి చేశారు.
అయితే ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అధిత్యనాథ్ కర్ణాటక పర్యటన చేసి.. హనుమంతుడు పుట్టిన ప్రదేశంలో.. టిప్పు సుల్లాన్ జయంతోత్సవాలా? అంటూ ప్రశ్నల వర్షం కురించగా, దానికి బదులిస్తూ.. బీజేపి అధికారంలో వున్న హాయంలో వారి నేతృత్వంలోనే టిప్పు సుల్లాన్ జయంతోత్సవాలను జరిపిన ఫోటోలను తన ట్విట్టర్ ద్వారా పోస్టు చేసి అప్పుడు లేని అభ్యంతరాలు.. ఎన్నికల ముందు ఎందుకని ప్రశ్నించి.. బీజేపిని ఇరకాటంలో పడేశారు.
దీంతో ప్రకాష్ రాజ్ పై పీకల్లోతు అగ్రహంతో రగిలిపోతున్న బీజేపి.. ఆయనకు ఎలా కౌంటర్ ఇవ్వాలో కూడా అర్థం కాని స్థితికి జారుకుంది. తాజాగా సిర్సీలో జరిగిన కార్యక్రమంలో ఆయన కేంద్రమంత్రి అనంతకుమార్ పై విమర్శలు గుప్పించడంతో వేదికను శుద్ది చేసి కౌంటర్ ఇచ్చామని సరిపెట్టుకోగలిగింది. అయితే నటుడు దీనిపై తాజాగా స్పందించారు. తాను ప్రసంగించిన వేదికలను బీజేపి నేతలు గోమూత్రంతో శుద్ది చేశారంటూ అయన వ్యాఖ్యనించారు.
బీజేపి నేతలు కేవలం సిర్సీలోనే ఇలా చేస్తారా..? లేక తాను ప్రసంగించే అన్ని వేదికలను శుద్ది చేస్తారా..? అని ప్రశ్నించారు. తాను కేవలం ప్రశ్నిస్తున్నాంటూ ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ప్రశ్నించిన ప్రకాష్ రాజ్.. ఇలా ఎన్నికలు ముందు మాత్రమేనా..? లేక నిత్యం తాను ఎక్కడి మాట్లాడితే అక్కడ.. వేదికలను శుద్ది చేస్తారా... అని ప్రశ్నించడం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. అయితే ఇందుకు సాక్ష్యంగా బీజేపి నేతలు వేదికను శుద్దిచేసిన పేపర్ క్లిపింగ్ ను కూడా జత చేశారు.
BJP workers cleaning and purifying the stage ..from where I spoke in Sirsi town ...by sprinkling cow urine (divine gomoothra)...
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more