సొంత రాష్ట్ర పర్యటనలో ముఖ్యమంత్రికి పరాభవం ఎదురైంది. రాష్ట్ర పర్యటనలో ఓ జిల్లాకు వెళ్లిన ముఖ్యమంత్రి కాన్వాయ్ పై గుర్తు తెలియని అగంతకులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎదురైంది. శుక్రవారం బిహార్లోని బక్సర్ జిల్లాలోని నందన్ ప్రాంతానికి వెళ్తుండగా, ఆయన కాన్వాయ్ పై అగంతకులు రాళ్లతో దాడి చేశారు. జరిగింది. వికాస్ సమీక్షా యాత్రలో భాగంగా ఆయన బక్సర్ జిల్లాలో పర్యటనకు వెళ్లగా, కాన్వాయ్ లోని ఓ వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.
ఈ దాడిలో ఆయన కాన్వాయ్ లోని భద్రతా సిబ్బంది కొందరు గాయపడ్డారు. అయితే ఈ దాడి నుంచి నితీశ్ సురక్షితంగా బయటపడ్డారని భద్రతాసిబ్బంది తెలిపారు. వికాస్ సమీక్షా యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దమ్రోన్ గ్రామంలో ఒక బహిరంగ సభకు హాజరయ్యే క్రమంలో ఈ దాడి జరుగగా, ఆయన ఈ దాడిపై స్పందిస్తూ.. రాష్ట్రాభివృద్ధి విషయంలో తన నిబద్ధతపై గిట్టని వారు ఇలా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, అలాంటి చిన్న చిన్న విషయాలకు ప్రజలు తమ సహనాన్ని కోల్పోకూడదన్నారు.
తనపై ఎవరు, ఎందుకు రాళ్లతో దాడి చేశారో ప్రస్తుతానికి తెలియదన్నారు. ‘రాష్ట్ర రాజధానిలో కూర్చొని ప్రజలను పాలించేందుకు కాదు నేనున్నది. రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో సైతం పర్యటించి అక్కడి ప్రజలకు శుద్ధ నీరు, విద్యుత్తు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా శ్రమించడమే నా కర్తవ్యం. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించినంత మాత్రాన నా ఆశయాన్ని నీరుగార్చలేరు’ అని నితీశ్ అన్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును సమీక్షించేందుకు వికాస్ సమీక్షా యాత్ర పేరుతో రాష్ట్రమంతా డిసెంబరు 12 నుంచి ఆయన పర్యటిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more