దాదాపుగా ఐదేళ్ల క్రితం అదృశ్యమైన ఎంహెచ్ 370 విమానం ఏమైంది.? ఐదేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఆ విమానం శఖాలాలైనా ఎక్కడా కనిపించలేదు. అందులో ప్రయాణించిన ప్రయాణికుల యోగక్షేమాలు కూడా ఇప్పటివరకు తెలియరాలేదు. అయితే ఆ విమానంలో ప్రయాణించిన తమవారు క్షేమంగానే వున్నారా.? లేక స్వర్గస్థులయ్యారా..? క్లారిటీ కావాలంటూ ప్రయాణికుల కుటుంబసభ్యులు మలేషియా ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి తీసుకువస్తున్నారు.
ఒకటి రెండు ఇలా ఏళ్ల గడిచేకొద్ది అదృశ్యమైన విమానం గురించి కూడా వెతకడాన్ని నిలిపేసింది మలేషియా ప్రభుత్వం. విమానం కోసం అన్ని రకాలుగా గాలింపు చర్యలు చేపట్టినా.. ఎక్కడికి వెళ్లిందన్న విషయం మాత్రం ప్రపంచంలోనే అతిపెద్ద ఏవియేషన్ మిస్టరీగా మిగిలిపోయింది. మలేషియా సహా పలు దేశాలు విమానం కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గాలింపును నిలిపివేశారు. అయితే ప్రయాణికుల బంధువుల ఒత్తిడి నేపథ్యంలో తాజాగా మలేషియా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. దీనిని విమాన ప్రయాణికుల కుటుంబ సభ్యులు స్వాగతిస్తున్నారు.
అదేంటంటే.. సరిగ్గా మార్చి 2014లో 239 మంది ప్రయాణికులతో వెళ్తూ అదృశ్యమైన మలేషియాకు చెందిన ఎంహెచ్ 370 విమానం ఆచూకీని కనిపెట్టేందుకు అమెరికా కంపెనీతో మలేషియా ప్రభుత్వం భారీ డీల్ కుదుర్చుకుంది. విమానం ఆచూకీని గుర్తిస్తే ఏకంగా 70 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 445 కోట్లు) ఇచ్చేందుకు ముందుకొచ్చింది. గతంలో ఆస్ట్రేలియా కంపెనీ ఒకటి విమానం ఆచూకీని గుర్తించేందుకు ముందుకొచ్చినా ఫలితం లేకుండా పోయింది. విమాన శకలాలను గుర్తించడంలో సదరు కంపెనీ విఫలమైంది. దీంతో గతేడాది జనవరిలో వెతకడం ఆపేశారు.
తాజాగా విమాన శకలాలను గుర్తిస్తే భారీగా నగదు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అయితే, విమాన ఆచూకీని గుర్తించడంలో విఫలమైతే మాత్రం పైసా కూడా ఇచ్చేది లేదని పేర్కొంది. ప్రభుత్వ ఆఫర్కు స్పందించిన అమెరికా కంపెనీ విమాన శకలాలను వెతికేందుకు ముందుకొచ్చింది. దక్షిణ హిందూ మహా సముద్రంలో అత్యాధునిక నౌక ద్వారా విమానాన్ని గుర్తించేందుకు అమెరికా కంపెనీ రంగంలోకి దిగనుంది. ఈ నెల మధ్య నుంచి 90 రోజులపాటు విమాన శకలాల కోసం గాలించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more