రంకు నేర్చినమ్మ బొంక నేర్వదా అన్నది పెద్దలు చెప్పిన పాత మాట. అయితే భర్త హత్యకు సుపారీ ఇచ్చిన జ్యోతి మాత్రం.. తనకేమీ తెలియదని అంతా తన ప్రియుడు ప్లాన్ చేశాడని చెప్పింది. సుధాకర్ రెడ్డిని హతమార్చి అతని స్థానంలో తన ప్రియుడ్ని తీసుకువచ్చేందుకు ప్లాన్ చేసిన స్వాతి ఘటనను మరువకముందే.. అదే పాలమూరు జిల్లాకు చెందిన మరో భార్య జ్యోతి కూడా తన భర్త నాగరాజును సుపారీ ఇచ్చి మరీ హతమార్చిన ఘటన వెలుగుచూసిన విషయం తెలిసిందే.
నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ మీడియా ఎదుట ప్రవేశపెట్టగా, జ్యోతి మాట్లాడుతూ తన భర్తను చంపాలని తాను అనుకోలేదని చెప్పింది. తన భర్త విషయంలో తనకేమి తెలియదని చెప్పింది. అయితే తన ప్రియుడు కార్తీక్ చెప్పిన ప్రకారం తాను పాలలో నిద్రమాత్రలు కలిపి తన భర్తకు ఇచ్చానంది. అయితే తన భర్తను చంపేస్తారని తనకు తెలియదని చెప్పింది. అపస్మారక స్థితిలో ఉన్న నా భర్తను ఎక్కడకు తీసుకెళ్తున్నారో చెప్పలేదని చెప్పిన జ్యోతి.. తన భర్త మృతదేహం లభ్యమైందని పోలీసులు ఫోన్ చేసి చెప్పిన తర్వాతే తెలిసిందని తెలిపింది.
కాగా, ఈ కేసులో నిందితుడు కార్తీక్ భిన్నవాదనలు వినిపించాడు.. నాగరాజు భార్య జ్యోతి ఒత్తిడి చేయడం వల్లే నాగరాజును చంపామని కార్తీక్ వెల్లడించాడు. ‘డిసెంబర్ 30న పదేపదే ఫోన్లు చేసి జ్యోతి రమ్మని పిలిచింది. పొద్దున నుంచి ఒకటే ఫోన్లు చేసింది. నాగరాజుకు నిద్రమాత్రలు వేసేశానని ఫోన్ చేయడంతో నా ఫ్రెండ్స్ను తీసుకుని వెళ్లాను. తర్వాత మేమంతా కలిసి అతడిని చంపేశాం. తర్వాత శవాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి దూరంగా పడేశామ’ని కార్తీక్ వివరించాడు. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు డీసీపీ రామచంద్రారెడ్డి తెలిపారు.
పాలమూలు జిల్లాకు చెందిన నాగరాజు తన భార్యతో కలసి హైదరాబాద్ కర్మన్ఘాట్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అయితే పెళ్లికి ముందునుంచే ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే పెళ్లైన తరువాత దూరమైన వారి సంబంధం మళ్లీ కార్మాన్ ఘాట్ కు చేరుకోవడంతో బలపడింది. అదే కార్పెంటర్ నాగరాజు హత్యకు దారితీసింది. ఈ కేసులో అతడి భార్య జ్యోతి, ప్రియుడు కార్తీక్, దీపక్, యాసీన్, నరేష్లను పోలీసులు అరెస్ట్ చేశారు. జ్యోతి, కార్తీక్, అతడి స్నేహితులు కలిసి పథకం ప్రకారం నాగరాజును హత్య చేశారని డీసీపీ రామచంద్రారెడ్డి తెలిపారు. నేరం చేసినట్టు నిందితులు అంగీకరించారని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more