కుల చిచ్చు రాజుకోవటంతో ముంబై మహానగరం అల్లకల్లోలంగా మారింది. పుణే దగ్గర్లోని భీమా–కోరేగావ్ యుద్ధ స్మారకం వద్ద 200వ విజయోత్సవాల సందర్భంగా సోమవారం హిందూ, దళిత సంస్థల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇది కాస్తా ముదిరి హింసాత్మకంగా మారింది.
మరోవైపు లక్షలాదిగా తరలివచ్చిన వారిపై దుండగులు రాళ్లు రువ్వడంతోపాటు వాహనాలకు నిప్పుపెట్టారు. మంగళవారం ఉదయమే రోడ్లపైకి చేరుకున్న ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. ఇద్దరు చనిపోవటంతో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. దీంతో లోకల్ రైళ్లు సహా పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఘర్షణలను అదుపు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ అంబేద్కర్ మనవడు, భరిపా బహుజన్ మహాసంఘ్ నేత ప్రకాశ్ అంబేద్కర్ ఆరోపించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా బుధవారం రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చారు.
అసలు కారణం ఏంటంటే...
200 ఏళ్ల క్రితం ఆంగ్లో-మరాఠా వార్ జరిగింది. పేష్వా బాజీరావు-2 సైన్యానికి, ఈస్టిండియా కంపెనీకి చెందిన చిన్న సైన్యానికి మధ్య యుద్ధం జరిగింది. ఈస్టిండియా కంపెనీ సైన్యంలో ఎక్కువమంది దళితులే ఉండేవారు. ఆ యుద్ధంలో మరణించిన వారిలో ఎక్కువమంది దళితులే. దీంతో వారి స్మారకార్థం సన్సవాడి గ్రామంలో బ్రిటిష్ వారు ‘విజయ స్తూపం’ నిర్మించారు.
జనవరి 1న ఈ స్తూపం వద్ద 200వ వార్షికోత్సవం నిర్వహించారు. లక్ష మంది దళితులు స్మారక స్తూపం వద్దకు చేరుకున్నారు. పేష్వా బాజీరావు-బ్రిటిషర్లకు మధ్య జరిగిన యుద్ధంలో ఆంగ్లేయులే విజయం సాధించినప్పటికీ మరణించిన వారిలో దళితులే ఎక్కువ కాబట్టి వారి స్మారకార్థం స్తూపం ఏర్పాటు చేశారు. దీనికి గుర్తుగా దళితులు ప్రతి ఏటా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అయితే ఇది బ్రిటిష్ వాళ్ల విజయం కావడంతో అతివాద సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో వారిపై రాళ్ల దాడి జరిగింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more