వైకుంఠ ఏకాదశి రోజున స్వామి వారి దర్శనాన్ని చేసుకునేందుకు భక్తులు ఇదివరకే తండోపతండాలుగా పుణ్యక్షేత్రాలకు చేరకున్నారు. క్యూలైన్లలో బారుతు తీరుతున్నారు. మరీ ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు. కంపార్టుమెంట్లతో పాటు, టీటీడీ ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లు భక్తులతో నిండిపోయాయి. రేపటి వైకుంఠ ఏకాధశి గడియల్లో శ్రీవారిని ఉత్తర ద్వార దర్శనంతో దర్శించుకోవడం శుభప్రదమని భావిస్తున్న భక్తులు.. వేలాది సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు.
దీంతో సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరితో పాటు వీఐపీల తాకిడి పెరిగింది. భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక గోవిందమాల వేసుకున్న భక్తులు కూడా కాలిబాట గుండా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాగా ఏకాదశి పర్వదినాన భక్తుల సౌకర్యార్థం టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. సామాన్య భక్తులు, ప్రముఖులకు వేర్వేరుగా బస, దర్శన ఏర్పాట్లు చేశారు. బుధవారం అర్థరాత్రి నుంచి దివ్యదర్శనం టికెట్ల జారీని నిలిపివేశారు.
సర్వదర్శనం మినహా ఐదు రోజుల పాటు దివ్యదర్శనం సహా అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. కనుమ రహదారులను 24 గంటల పాటు తెరిచే ఉంచుతారు. ధనుర్మాస పూజల తర్వాత వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఏకాదశి, ద్వాదశి రెండు రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించనున్నారు. ఉదయం 5 గంటలకు వీఐపీ దర్శనాలను అనుమతించిన అనంతరం 7.30 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభం కానుంది. రెండు రోజులు పాటు 40 గంటలకు పైగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కలిగేలా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో అన్ని అలయాలు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా రంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. మరీ ముఖ్యంగా ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేసే అలయాలల్లో ప్రత్యేక అధ్యాత్మిక శోభను సంతరించుకునేలా ఆలయ కమిటీలు ఏర్పాట్లను చేశాయి. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలను తీసుకుంటున్నారు. రాత్రి ఒంటి గంట నుంచి ఆలయాలకు భక్తుల తాకిడి పెరుగనున్న నేపథ్యంలో పోలీసులు కూడా గస్తీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
కాగా, మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు భద్రాది రామయ్య ఆలయంలో ఏకాదశి పర్వదినం సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకులకు కూడా వైకుంఠ ద్వాదశి రోజున ముగియనున్నాయి. దీంతో ఇక్కడ కూడా భక్తుల తాకిడి అధికంగానే వుంది. దశమి రోజునే వచ్చి పుణ్యక్షేత్రాలకు చేరుకునే భక్తులకు కూడా అలయ అధికారులు ఏర్పాట్లు చేయడంతో పాటు ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహణకు సిద్దమయ్యారు. బాపట్లలోని క్షీర భావన్నారాయణ ఆలయం, తణుకు వెంకటేశ్వర స్వామి ఆలయం, యాదగిరి లక్ష్మీనరసింహస్వామి అలయం, అనంతగరి పద్మనాభస్వామి ఆలయం, వేములవాడ రాజన్న ఆలయం సహా అన్ని ప్రముఖ దేవాలయాలు భక్తులు తరలివెళ్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more