పార్టీ అధ్యక్ష బాధ్యతలను కుమారుడు రాహుల్ గాంధీ భుజస్కంధాలపై వేసిన తరువాత కాంగ్రెస్ సుప్రీమో సోనియాగాంధీ సంతోషంగా వున్నారు. కాషాయపార్టీకి కంచుకోటగా వున్న గుజరాత్ లో తన పుత్రరత్నం రాహుల్ ప్రచారం బాగా కలసివచ్చిందనో.. లేక కొద్దిపాటి తేడాతో అధికారానికి దూరమైయ్యామనో తెలియదు కానీ అమె తన పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్న తరువాత లభించిన క్షణాలను సంతోషంగా గోవాలో ఎంజాయ్ చేస్తున్నారు. దక్షిణ గోవాలోని ఓ రిసార్డులో అమె విశ్రాంతి తీసుకుంటున్నారు.
పదేళ్ల సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సేవలందించిన ఆమె, ప్రస్తుతం రిలాక్స్ అవుతూ దక్షిణ గోవాలోని ఓ రిసార్టులో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ స్థానికులతో అమె మమేకమై వారితో సంబాషిస్తూన్నారు. అమెను చూసిన కొందరు స్థానికులు, పర్యాటకులు అమెతో సెల్పీలు తీసుకునేందుకు కూడా ఉత్సాహం కనబరుస్తుండగా, దానికి కూడా సోనియాగాంధీ అనుమతిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలను కూడా సోనియాగాంధీ గోవాలోనే జరుపుకోనున్నట్లు తెలుస్తుంది.
నూతన సంవత్సరం జనవరి మొదటి వారంలో అమె తిరిగి ఢిల్లీ వెళతారని గోవా కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ బాధ్యతల నుంచి మాత్రమే తప్పుకున్నాను తప్ప రాజకీయాల నుంచి కాదని అమె స్పష్టత నిచ్చిన తరువాత.. ఇలా అమె రిలాక్స్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. గోవాలో ఉన్న సోనియా, అక్కడి బీచ్ లలో సైక్లింగ్ కూడా చేస్తూ అరోగ్యంపై కూడా శ్రద్ద తీసుకుంటున్నారు. కాంగ్రెస్ సుప్రీమో తమతో ఓపికగా మాట్లాడుతూ, వారితో ఫొటోలు దిగుతుండటం స్థానికులను అశ్చర్యానికి లోనవుతున్నారు. కాగా, రోజూ కాసేపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపైనా నేతలతో చర్చిస్తున్నారు.
Some pictures make you happy... this is one of them.
— Riteish Deshmukh (@Riteishd) December 28, 2017
Wishing Sonia ji happiness and best of health. pic.twitter.com/SSITMjOnCD
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more