తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పునాదిరాళ్లుగా వున్న సీనియర్ నేతల్లో మోత్కుపల్లి నర్సింహులు ఒకరు. తన తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలతో ఏర్పర్చుకున్న అవినాభావ సంబంధంతో ఆయన పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2014 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలైన మోత్కుపల్లికి పార్టీలో కన్నా ప్రభుత్వ పరంగానే ఒక సముచిత స్థానం ఇవ్వాలని పార్టీ భావించింది. ఈ క్రమంలో ఆయన పేరును రాష్ట్ర గవర్నర్ గా నియమించేందుకు కేంద్రంలోని తమ భాగస్వామ్య పక్షమైన ఎన్టీఏ ప్రభుత్వానికి విన్నవించింది.
దీంతో త్వరలోనే మోత్కుపల్లికి గవర్నర్ పదవి వరిస్తుందని వార్తలు కూడా మీడియాలో హైలైట్ అయ్యాయి. అటు ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఎన్నుకోబడిన తరుణంలో అయనను సన్మానించేందుకు వెళ్లిన టీడీపీ నేతలతో పాటు వెళ్లిన మోత్కుపల్లికి.. త్వరలోనే గవర్నర్ పదవి నిన్ను వరిస్తుంది అని వెంకయ్యనాయుడు మోత్కుపల్లితో అన్నారని కూడా వార్తలు వచ్చాయి. దీంతో రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం, మార్పులు చేర్పులు జరిగిన ప్రతిసారి అశపడటం.. భంగపడటం మోత్కుపల్లి వంతైంది.
ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఈ పదవి తనకు దక్కకపోవడంపై మోత్కుపల్లి స్పందిస్తూ, ఆ పదవిపై తన మదిలోని మాటలు బయటపెట్టారు. ఇక గవర్నర్ పదవి కోసం మూడేళ్లుగా ఎదురుచూశానని, ఇక ఇప్పుడు దాని గురించి ఆలోచించడమే మానేశానని అన్నారు. ఆ పదవి గురించి మర్చిపోవడమే తన ఆరోగ్యానికి మంచిదని, దానిపై ఆశలు దాదాపు వదులుకున్నట్టేనని మోత్కుపల్లి వ్యాఖ్యానించడం గమనార్హం. తనను గవర్నర్ చేయాలనే ఆలోచన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిదేనని, తనకు ఆ పదవి ఇప్పించేందుకు ఆయన ఎంతో కృషి చేసినప్పటికీ, ఫలితం లేకుండా పోయిందని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more