Seven People of Same Family Died in Yadadri Bhuvanagiri | యాదాద్రి జిల్లాలో విషాదం.. ఒకే ఇంట్లో ఏడుగురి మృతి.. హత్య? సూసైడా?

Family suspicious death in yadadri bhuvanagiri

Yadadri Bhuvanagiri, Family Death, Yadadri Family Suicide, Suspicious Death Case, Yadadri Crime News, Telangana News

Seven People of Same Family Died in Yadadri Bhuvanagiri. Police Register Suspicious Death Case. The Whole Family Migrate from Jagadevpur and Victim Family recognized as Balaraju Family.

యాదాద్రిలో విషాదం.. ఒకే ఇంట్లో ఏడుగురి మృతి!

Posted: 12/22/2017 08:46 AM IST
Family suspicious death in yadadri bhuvanagiri

యాదాద్రి భువనగిరి జిల్లా శుక్రవారం ఉదయం ఓ వార్తతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఒకే ఇంట్లో ఏడుగురు మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. రాజాపేటలోని స్థానిక 'నాగభూషణం కోళ్ల ఫారం' వద్ద ఉన్న ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న ఏడుగురి మృతదేహాలు కనిపించాయి. వారందరినీ ఒకే కుటుంబానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు.

ఉమ్మడి మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం మునిగడ గ్రామానికి చెందిన బాలరాజు నెల రోజులుగా భార్య తిరుమలతో కలిసి రాజాపేటలోని నాగభూషణం కోళ్ల ఫారంలో పనిచేస్తున్నాడు. దీనికి సమీపంలో ఉన్న ఓ ఇంట్లో భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. వీరిని చూసేందుకు గురువారం తిరుమల తల్లిదండ్రులు రాజాపేట వచ్చారు. అయితే అంతా విగతజీవులుగా పడి ఉన్నారు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అందరూ మృతి చెంది ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన వీరంతా నిద్రలోనే ఎలా ప్రాణాలు కోల్పోయారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అందరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారా? లేక, ఎవరైనా హత్య చేశారా? లేదంటే, ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఇలా జరిగిందా? అన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles