మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వం ఉన్నవాడు అన్న కవి మాటలు నిజమవుతున్నాయి. ఆధునిక మానవుల్లో మంచితనం కొడిగడుతోంది. సంకుచిత ధోరణితో మనిషి కుంచించుకుపోతున్నాడు. మనిషికి మనిషే సాయం చేసుకోవాలన్న ఇంకితాన్ని మర్చిపోయాడు. ఎంతో విలువైన ప్రాణం పోతున్నా చోద్యం చూస్తు నిలబడ్డాడే కానీ.. ప్రాణాలను కాపాడేందుకు ఒక్కడైనా ముందుకు రాలేదు.
ఆధునిక యుగంలో మంటగలుస్తున్న మానవత్వానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనం. సోషల్ మీడియాలో లైకుల కోసం పడే పాట్లు.. మంచి కోసం. విలువైన ప్రాణం కోసం చేయి కలపడం మాత్రం తెలియదు. లైకులతో తమ అభిప్రాయాలను పంచుకుంటారే కానీ.. అర్థించేవారికి అపన్నహస్తాన్ని అందించరు. కొనఊపురితో విలవిలలాడుతున్న మనిషి.. ఇక తమ వద్ద వున్నప్పుడే ప్రాణం పోతే తామే బాధ్యులని చేస్తూ పోలీసు కేసుల చుట్టూ తిరగాల్సి వస్తుందని భావించి.. ఎవరికి వారు తప్పించుకోచూశారు. ఈ హృదయవిదారక ఘటన విజయనగరం జిల్లాలోని భోగాపురంలో జరిగింది.
వారం రోజులుగా తీవ్రైన దగ్గుతో బాధపడుతున్న శ్రీకాకుళం బ్యాంకర్స్ కాలనీకి చెందిన ఎల్ఐసీ ఏజెంట్ పొన్నాడ అచ్యుత్ (50).. తన కుమారిడితో కలసి అసుపత్రిలో చూయించుకునేందుకు ఆర్టీసీ బస్సులో విశాఖపట్టణం బయలుదేరాడు. బస్సు విజయనగరం జిల్లాలోని భోగాపురం ఫ్లై ఓవర్ వద్దకు చేరుకునే సరికి అచ్యుత్ అస్వస్థతకు లోనయ్యాడు. గుండెల్లో నొప్పిగా ఉందని కుమారుడికి చెప్పాడు. విష్ణు కండక్టర్ కు విషయం చెప్పి ఏదైనా ఆసుపత్రి కనిపిస్తే ఆపాలని కోరాడు.
తన తండ్రి పరిస్థితి చూసి విలవిల్లాడిన విష్ణుకు ఏం చేయాలతో తోచలేదు. కనీసం బస్సులో వున్న ఏ ఒక్కరైనా 108కు ఫోన్ చేయలేదు. చాకివలస చౌరస్తా వద్దకు వచ్చేసరికి నొప్పి ఎక్కువై అచ్చుత్ విలవిల్లాడిపోయాడు. ఇది గమనించిన డ్రైవర్ వెంటనే బస్సు ఆపేసి అచ్యుత్, అతడి కుమారుడిని నడిరోడ్డుపై దించేశాడు. అర్టీసీ బస్సు డ్రైవరే చోరవ తీసుకోకపోతే.. అటోవాలాలు ముందుకోస్తారా..? అదే జరిగింది. ఒక్కరంటే ఒక్క అటోవాలా కూడా ముందుకు రాలేదు.
చివరాఖున ఓ ఆటోవాలా ముందుకొచ్చి ఎక్కించుకుని తీసుకెళ్తుండగా, అచ్చుత్ కు మరింత నోప్పి అధికం కావడాన్ని గమనించిన అటోడ్రైవర్ మారిన మార్గమధ్యంలోనే దించేసి వెళ్లిపోయాడు. కనీసం అక్కడైన ఏ ఒక్క ధర్మాత్ముడైనా అంబులెన్సుకు ఫోన్ చేసివుంటే ఎంతో మంది జీవితాలలో వెలుగునింపే ప్రయత్నం చేసిన ఆ ప్రాణం నిలబడేది. కానీ మా పని మాకు ముఖ్యం మాకు సామాజం అంటే సోషల్ మీడియానే అనుకుని భ్రమల్లో బతుకులీడుస్తున్న నేటి తరం మనుషులు మచ్చకైనా లేని మానవతం ఆ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.
ఎవరైనా సాయం చేయండీ సార్.. మా నాన్నను అసుపత్రికి తీసుకెళ్లేందుకు హెల్స్ చేయండీ సార్ అని ఓ వైపు విలపిస్తూ ఆ కొడుకును చూసి మరింత దిగజారిన ఆ తండ్రి అరోగ్యం పూర్తిగా విషమించింది.. దీంతో నడిరోడ్డుపై తీవ్ర మానసిక వేదన అనుభవిస్తూ ఆ తండ్రి తన కొడుకు విష్ణు చేతుల్లోనే.. ప్రాణాలను విడిచాడు. ఆయన చనిపోయిన ప్రదేశానికి కొన్ని మీటర్ల దూరంలో ప్రైవేటు క్లినిక్లు ఉన్నాయి. కిలోమీటరు దూరంలో ప్రభుత్వాసుపత్రి ఉంది. బస్సు డ్రైవర్ కనికిరించినా, ఆటోవాలా.. చుట్టూ గుమిగూడిన జనం ఎవరో ఒకరు సాయం చేసినా తన తండ్రి బతికేవాడని విష్ణు కన్నీటి పర్యంతమయ్యాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more