అనారా గుప్త. 15 ఏళ్లకే మిస్ కాశ్మీర్ గా ఎంపికై అందాల కిరీటం దక్కించుకున్న ఈ బోజ్ పూరీ నటి పేరు అప్పట్లో కలెక్టర్ కావాలన్న అశయం వుందన్న వ్యాఖ్యల నేపథ్యంలో పాపులర్ కాగా, ఆ తరువాత ఓ అసభ్యకర వీడియో కనిపించి దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఇక తాజాగా, ఓ మీడియా కంపెనీని ఏర్పాటు చేసి రూ.200 కోట్ల మేర కుంభకోణానికి తెరలేపిందన్న వార్తలతో ఇప్పుడు వార్తల పతాకశీర్షికలకు ఎక్కింది.
వివాదాస్పద వ్యక్తిగా చాలా పాపులర్ అయిన ఈ మిస్ జమ్మూకాశ్మీర్ చుట్టూ ఈ స్కామ్ వార్తలు చెలరేగడంతో మీడియా ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తాను అమాయకురాలినని, తనకు ఈ స్కామ్ కు సంబంధం లేదని చెప్పడమే కాదు.. ఏకంగా స్కామ్ అని అంటారేంటి రెండు వందల కోట్లు కాదు కేవలం రెండు లక్షల రూపాయలు అంటూ అడ్డగోలుగా మాట్లాడి.. మీడియా అడిగిన ప్రశ్నలకు దాటవేత ధోరణితో సమాధానాలు చెప్పింది.
0బోజ్ పురీ సినిమాలు, సీరియల్స్ లో నటిస్తూ అక్కడి ప్రేక్షకులకు చాలా దగ్గరైన అనరా.. మంచి పాపులారిటీ సంపాదించింది. తన మాయమాటలనే పెట్టుబడిగా పెట్టుకుని.. సినిమాలు, సీరియల్స్ లో అవకాశాలు ఇప్పిస్తానంటూ నమ్మించి ప్రకటనలు ఇచ్చి అందర్నీ నమ్మించింది. అందు కోసం ట్రైనింగ్ ఉంటుందని.. ఆ తర్వాత అవకాశాలు ఇప్పిస్తానని చెప్పింది. నమ్మిన వేలాది మంది డబ్బులు కట్టారు. ఇలా ఏకంగా రూ.200 కోట్ల రూపాయల మేర పొగయ్యాయి.
ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో 45వేల మందిని చీట్ చేసింది. నెలలు గడుస్తూ ఒక్కరికి కూడా అవకాశాలు ఇప్పించకపోవటంతో.. కేసులు నమోదు చేశారు బాధితులు. అయితే ఈ విషయమై మీడియా ప్రశ్నలు గుప్పించగా, తాను అగస్టు మాసంలోనే అ కంపెనీని వదిలేశాయని, తనకు ఆ కుంభకోణంతో ఏం సంబంధం లేదని బుకాయించింది. తన ఫోన్ కూడా అందుబాటులోనే వుందని, ఇక ఈ విషయంలో లక్నో పోలీసులు తనకు ఇప్పటి వరకు కనీసం ఫోన్ కూడా చేయలేదని చెప్పింది. తాను ముంబైలోనూ వున్నానని కూడా ప్రకటించేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more