కేంద్ర మాజీ మంత్రి, లోక్ సభ ఎంపీ కమల్ నాథ్ కు తన సోంత పార్లమెంటరీ నియోజకవర్గంలో అపాయకర ఘటన ఎదురైంది. ఓ కానిస్టేబుల్ తన సర్వీస్ రైఫిల్ ను ఏకంగా మాజీ మంత్రికి గురిపెట్టిన ఘటన మధ్యప్రదేశ్ లో కలకలం రేపింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆయన సెక్యూరిటీ సిబ్బంది కానిస్టేబుల్ అడ్డుకొని పక్కకు తోసేశారు. అనంతరం అయనను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు కానిస్టేబుల్ రత్నేష్ పవార్ గా గుర్తించారు.
పార్లమెంటు సభ్యుడు కమల్ నాథ్ మధ్యప్రదేశ్ లోని తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గం ఛిన్ ద్వారాలో పర్యటించిన అనంతరం ఢిల్లీకి చార్డెట్ విమానంలో బయలుదేరేందుకు విమానాశ్రయానికి చేరుకున్నారు. అదే సమయంలో అక్కడ సెక్యూరిటీ బాద్యతలను నిర్వహిస్తున్న రత్నేష్ పవార్ అనే కానిస్టేబుల్ అనుమానాస్పదంగా వ్యవహరించాడు. కమల్ నాథ్ విమానం ఎక్కుతుండగా.. పవార్ తన సర్వీస్ రైఫిల్ ను ఆయన వైపు గురిపెట్టి.. అనుమానాస్పదంగా కనిపించాడు.
దీంతో వెంటనే అప్రమత్తమైన అంగరక్షకులు కానిస్టేబుల్ రత్నేష్ పవార్ ను అడ్డుకొని.. పక్కకు తోసేశారు. వెంటనే స్థానిక పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో కానిస్టేబుల్ పవార్ ను సస్పెండ్ చేసిన మధ్యప్రదేశ్ పోలీసుశాఖ.. అతను ఎందుకలా అనుమానాస్పందంగా వ్యవహరించాన్న కోణంలో విచారణ చేస్తున్నామని ఏఎస్పీ నీరజ్ సోనీ వెల్లడించారు. కమల్ నాథ్ ఛిన్ ద్వారా లోక్ సభ స్థానం నుంచి ఇప్పటివరకు 9 సార్లు ఎంపీగా గెలుపొందారు. అయితే, ఈ ఘటన మాజీ మంత్రి దృష్టికి రాలేదని ఆయన యథావిధిగా రాహుల్ పట్టాభిషేకం కోసం ఢిల్లీకి బయలుదేరి వేళ్లారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more