wife murders husband by paying supari స్వాతిని మించిన ఖతర్నాక్ కలాంతకురాలు..

Another swathi in kurnool wife murders husband by paying supari

nagar kurnool, kurnool, swati, venkateshwarmma, supari, manohar, rajesh, illicit affair, mulla mahaboob basha, maddaleti, maddaiah, sudhakar reddy, telanagana, andhra pradesh, telugu states, kurnool police, crime

After nagarkurnool swathi incident, another similar incident comes into light as police suspects the deceased's wife in this case.

మరో స్వాతి.. భర్త హత్యకు హంతకులకు సుఫారీ

Posted: 12/16/2017 10:23 AM IST
Another swathi in kurnool wife murders husband by paying supari

కట్టుకున్న భార్య తప్పు చేసినా.. తన భార్యే కదా అంటూ మందలించి.. మళ్లి రీపీట్ చెయ్యోద్దూ అంటూ మందలించిన భర్తను ప్రియుడితో కలసి మట్టుబెట్టిన కాలంతకురాలు స్వాతి ఘటన తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సమయంలోనే అంతకుమించిన ఘటన అంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. జిల్లాలోని బ్రాహ్మణపల్లెకు చెందిన ఓ ఇల్లాలు లక్ష రూపాయల సుఫారీ కుదుర్చుకొని కట్టుకున్న భర్తను హత్య చేయించింది. మానవ సంబంధాలన్నీ మనీ చుట్టే తిరుగుతాయని, లేదా మగువల చుట్టే తిరుగుతాయని పెద్దలు చెప్పిన నగ్నసత్యాలను నిజం చేస్తున్నాయి తాజాగా చోటుచేసుకుంటున్న ఘటనలు.

కర్నూలు ఘటనలో హతుడు స్వయంగా తన అమ్మ తమ్ముడు.. మేనమామే కావడం విస్మయం కలిగిస్తోంది. నగర్ కర్నూలు జిల్లాలకు కొంతదూరంలోనే వున్న కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లెలో ఈ నెలాంరంభంలోనే ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. బ్రాహ్మణపల్లెకు చెందిన వడ్డె చిన్న మద్దలేటి అలియాస్ మద్దయ్యకు తన అక్క కూతురును వెంకటేశ్వరమ్మతో ఆరు సంవవత్సరాల క్రితం పెళ్లయ్యింది.

తమ అన్యోన దాంపత్యానికి గుర్తుగా వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయతే స్వాతి విషయంలో చోటుచేసుకున్న పరిణమాలే ఇక్కడా అవకాశాన్ని అందిపుచ్చుకన్నాయి. తన భర్త కుటుంబ పోషణ, నలుగురి మాదిరిగా హుందాగా బతికేందుకు అర్జన విషయంలో తనమునకలు కాగా, అతని భార్య వెంకటేశ్వరమ్మ మాత్రం పక్కదారి పట్టింది. అదే గ్రామంలో నివసించే ముల్ల మహబూబ్ బాషా అనే వ్యక్తితో అమెకు రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పాడి అప్పటి నుంచి వారి అక్రమ సంబంధానికి దారి తీసింది. ఇటీవలే భర్తకు వీరి సంగతి నిలదీశాడు. దీంతో అతడి అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి వెంకటేశ్వరమ్మ స్కెచ్ వేసింది.

భర్తను హత్య చేయించడం కోసం బలపాలపల్లెకు చెందిన మనోహర్ తో లక్ష రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుంది. రూ.80 వేలు అడ్వాన్స్ గా చెల్లించింది. పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగిన మనోహర్.. వెంకటేశ్వరమ్మ భర్తతో దోస్తీ చేశాడు. తరచూ కలిసి వీరిద్దరూ మద్యం తాగేవారు. నమ్మకం కుదిరిన తర్వాత మద్దయ్యను డిసెంబర్ 4న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మద్యం తాగించి.. మరో వ్యక్తి సాయంతో బండరాయిని తలపై బాది హతమార్చాడు. మిస్టరీగా మారిన ఈ హత్య కేసులో.. భార్య వైఖరిపై అనుమానం వచ్చిన పోలీసులు అక్రమ సంబంధం కోణంలో విచారణ జరపగా.. నిజం బయటకు వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles