రంగారెడ్డి జిల్లా గండిపేట్లోని చైతన్య భారతి ఇస్టిట్యూల్ అప్ టెక్నాలజీ (సీబీఐటీ) ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థుల ఆందోళన ఏడో రోజుకు చేరుకుంది. యాజమాన్యం ఏకపక్షంగా ఫీజుల పెంపు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పరీక్షలను సైతం బహిష్కరించిన విద్యార్థులు యాజమాన్యానికి వ్యతిరేకంగా అందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. కాలేజీ ఎదుట వందల సంఖ్యలో వస్తున్న విద్యార్థులు అక్కడే గుమ్మిగూడి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
ఇవాళ సిబిఐటీ విద్యార్థులు గండిపేట్ మెయిన్ రోడ్డు నుంచి సీబీఐటీ కాలేజ్ వరకు ర్యాలీ తీశారు. అందోళన చేస్తున్న విద్యార్థులకు ఏబీవీపీ నేతలు కూడా కలవడంతో అందోళన కార్యక్రమాలు మరింత ఉదృతంగా మారుతున్నాయి. ఇప్పటికే కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు వారం రోజుల పాటు సెలవులను ప్రకటించింది. అయినా విద్యార్ధులు కాలేజీకి వచ్చి తమ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. పెంచిన ఫీజును తగ్గించే వరకు ఆందోళన కొనసాగుతుందని విద్యార్థులు యాజమాన్యానికి తేల్చిచెబుతున్నారు.
మరోవైపు విద్యార్ధులు ఆందోళన విరమించాలని కోరారు సీబీఐటీ ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి. విద్యార్ధుల డిమాండ్ పై సానుకూలంగా నిర్ణయం వచ్చేందుకు.. తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా విద్యార్ధులు ఒక్కసారిగా ప్రిన్సిపాల్ క్యాబిల్ లోకి దూసుకెళ్లారు. అక్కడి నుంచి అయనను కదలనీయకుండా ఘెరావ్ చేశారు. ప్రస్తుతం లక్షా 13 వేల రూపాయలుగా వున్న ఫీజును ఏకంగా రెండు లక్షలకు పెంచారని, ఇది ఏకంగా 74 శాతం అధికమని.. విద్యార్థి సంఘాలు నిలదీస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more