ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులు సాగిస్తున్న పోరాటానికి సినీనటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ స్పందించారు. విద్యార్థులు గత కొన్ని నెలలుగా సాగిస్తున్న పోరాటానికి పవన్ కూడా మద్దతు ప్రకటించారు. ఇన్నాళ్లు ఏ రాజకీయ నాయకుడి అండ లభించక విద్యార్థులుగా సాగిస్తున్న ఉద్యమానికి జనసూనాని అభయహస్తాన్ని అందించడంతో కొండంత అండ లభించినట్లైంది. మైనారిటీ విద్యార్థుల కోసం మెడికల్ సీట్లను తీసుకువచ్చామని.. అది తమ ఘనతగా చెప్పుకున్న టీడీపీ ప్రభుత్ం.. వారి సమస్యలను పరిష్కరించడంలో మాత్రం ఏమాత్రం చిత్తశుద్ది లేకుండా వ్యవహరించిందని దుయ్యబట్టారు.
కౌన్సిలింగ్ లో సీట్లు వచ్చిన తరువాత తాము కళాశాలలో చేరితే తమనే దోషులుగా చేస్తున్నారని విద్యార్థలు తమ అవేదనను జనసేనాని ఎదుట వినిపించారు. ప్రభుత్వం తను లాంగ్ టర్మ్ కోచింగ్ కు పంపతామని చెబుతుందని, తాము వెళ్తామని, అయితే తమకు ర్యాంకు రాని పక్షంలో ప్రభుత్వం తమ భవిష్యత్తుకు ఎలాంటి భరోసాను ఇస్తుందని విద్యార్థులు ప్రశ్నించారు. దీంతో ఫాతిమా వైద్య కళాశాలలో చదువుతున్న విద్యార్థుల ఉద్యమానికి తాను మద్దతునిస్తున్నట్లు పవన్ కల్యాన్ ప్రకటించారు. తప్పు చేయని విద్యార్థులకు శిక్ష వేయడం సరికాదని అన్నారు. కళాశాల యాజమాన్యం చేసిన తప్పులకు విద్యార్థులను శిక్షిస్తారా? అని ప్రశ్నించారు.
విజయవాడలో ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులు, తల్లిదండ్రులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థుల సమస్యలపై మంత్రి కామినేనితో మాట్లాడతానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుందన్నారు. విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించేందుకైనా వెనుకాడనని ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్ నాశనమవుతుంటే చూస్తూ కూర్చోనని స్పష్టం చేశారు. వారం రోజుల్లో తప్పనిసరిగా న్యాయం చేస్తానని పేర్కొన్నారు. మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తే జనసేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులు పవన్ తో మాట్లాడుతూ మరో నెల రోజుల్లో పరీక్షలు ఉన్న సమయంలో తమ ప్రవేశాలను రద్దు చేశారని తెలిపారు. కళాశాల యాజమాన్యం మోసం చేసిందని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more