అధికారంలో వున్న సమయంలో తమ అధికారాన్ని వినియోగించుకుని అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాల నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం బంధువుల ఇళ్లపై ఎన్ ఫోర్స్ మెట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేపట్టారు. ఎయిర్ సెల్-మ్యాక్సిస్ కేసులో నిధులు మళ్లింపులు జరిగాయన్న అభియోగాలపై కార్తి చిదంబరానికి చెందిన నాలుగు ప్రాంతాలతో పాటు చిదంబరం బంధువుల ఇంటిపై కూడా ఈడీ దాడులు నిర్వహించి సోదాలు చేస్తుంది. చెన్నైలోని నాలుగు ప్రాంతాల్లో, కోల్కతాలోని రెండు ప్రాంతాల్లో ఇవాళ ఉదయం నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
2006లో జరిగిన ఎయిర్ సెల్-మ్యాక్సిస్ ఒప్పందంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఎయిర్ సెల్ లో 80మిలియన్ డాలర్ల (దాదాపు రూ.3500కోట్లు) పెట్టుబడులు పెట్టడానికి మారిషస్ కు చెందిన మ్యాక్సిస్ కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. అయితే రూ. 600కోట్ల పైబడిన విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇచ్చే అధికారం ప్రధానమంత్రి నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి మాత్రమే ఉండగా.. అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం సొంతంగా నిర్ణయం తీసుకుని అనుమతులు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ విషయంపై కేసు నమోదైంది.
కాగా.. ఈ కేసులో చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంపైనా ఆరోపణలు వచ్చాయి. కార్తి చిదబరం.. తండ్రి అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని తమనుంచి డీల్ తీసుకున్నారని అభియోగాలను అప్పట్లో ఎయిర్ సెల్ సంస్థ అరోపించింది. దీంతో విచారణ చేపట్టిన ఈడీ అధికారులు.. తాజాగా సోదాలు చేపట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more