అమ్మా పెట్టా పెట్టదు.. అడక్కు తిననివ్వదూ అంటూ ఓ సామెత ఆ మెట్రో రైలు ప్రయాణికుడికి కోపాన్ని తెప్పించింది. దీంతో సదరు ప్రయాణికుడు ఏకంగా మధ్యం బాటిల్ తో అమీర్ పేట్ మెట్రో స్టేషన్లోకి ఎంటరయ్యాడు. తన వద్ద మద్యం బాటిల్ వుందని చూపుతూ అక్కడి ప్రయాణికులను అందోళనకు గురిచేశారు. దీంతో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన మెట్రలో రైలు సర్వీసులకు రెండో రోజునే తొలి విఘ్నం ఏర్పడినట్లు అయ్యింది. ఎందకయ్యా మద్యం బాటిల్ ను తీసుకుని స్టేషన్ లోకి వచ్చి కలకలం రేపావు అంటే.. తనకు పట్టరాని కోపం వచ్చిందన్నాడు.
అయితే అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎవరిపైన కోపం వచ్చిందయ్యా అని విచారిస్తే.. మీ పైనే అంటూ ప్రయాణికుడు పోలీసులనే చూపించాడు. దీంతో అసలేం జరిగిందన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు పోలీసులు.. మెట్రో రైళ్లలో ఏసీ వుంటుందని ప్రకటించిన ప్రభుత్వం.. మెట్రో స్టేషన్ లో చల్లటి తాగునీరు కూడా ఏర్పాటు చేసి వుంటుందని భావించిన అతను టికెట్ తీసుకుని స్టేషన్ లోకి వచ్చాక.. తాగేనీరు ఎక్కడా అని అడిగితే అక్కడి సిబ్బంది బయటికి వెళ్లి తెచ్చుకోమని బదులిచ్చారు.
దీంతో విస్మయానికి గురవుతూ బయటకు వచ్చిన ప్రయాణికుడు తీరా వాటర్ బాటిల్ కనుక్కుని లోనికి వస్తుండగా పోలీసులు తనను లోపలికి రానివ్వలేదని చెప్పాడు. అందుకే తనకు ఆగ్రహం వచ్చిందని, వెళ్లి లిక్కర్ బాటిల్ కొనుక్కుని మెట్రో స్టేషన్ లోకి వచ్చానని చెప్పాడు. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. మెట్రో రూల్స్ ప్రకారం నడుచుకోవాలన్న అదేశాలను మీరినందుకు అతడ్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అయితే వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు అని గోప్పలకు పోతున్న ప్రభుత్వం, జీహెచ్ఎంపీ, మెట్రో రైల్, ఎల్ అండ్ టీ సంస్థలు.. ప్రయాణికులకు కనీసం మంచినీళ్లు కూడా ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more