దేశ రాజకీయాల్లో దాడుల సీజన్ నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకు అగ్రనేత పక్షాన దిగువస్థాయి నేతలు, కార్యకర్తలు ఫలానా చేస్తే ఫలానా ప్రతిఫలం అందిస్తామన్న ప్రకటనలు పోయి.. ఏకంగా అగ్రనేతలే దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. అర్జేడీ పార్టీకి రెండు కళ్ల మాదిరిగా వున్న లాలూ కుమారులలో చిన్నవాడైన తేజస్వీ యాదవ్ డిఫ్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు నిర్వహించారు.
అయితే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ కు మాత్రం సినీరంగంపైనే మక్కువ ఎక్కువ. ఆ మద్య శ్రీకృష్ణుడి అవతారం ధరించి ఏకంగా ప్రధాని నరేంద్రమోడీనే మెప్పించాడు తేజ్ ప్రతాప్. అలాంటి తేజ్ ప్రతాప్ చెంప పగులగొట్టిన వారికి కోటి రూపాయల నజరానా ఇస్తానని బీహార్ బీజేపీ మీడియా ఇన్ ఛార్జ్ అనిల్ సాహ్ని ప్రకటించారు. దీంతో బీహార్ వ్యాప్తంగా పెను కలకలం రేపుతోంది.
బీహార్ బీజేపీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ అక్రమాలను బయటపెడతానని, ప్రజలందరి ముందు ఆయన చెంప పగుల కొడతానని తేజ్ ప్రతాప్ యాదవ్ హెచ్చరించారు. అంతటితో ఆగని ఆయన డిసెంబర్ 3న సుశీల్ కుమార్ మోదీ కుమారుడు ఉత్కర్ష్ వివాహానికి ఆహ్వానం అందిందని, ఒకవేళ తాను దానికి హాజరైతే అక్కడ రచ్చరచ్చేనని ప్రకటించారు.
ఈ నేపథ్యంలో... మోదీపై దాడి చేస్తానని తేజ్ చెప్పాడని, అతను దాడి చేయడానికి ముందే ఆయపై దాడి చేసిన వారికి కోటి రూపాయలు బహుమతిగా ఇస్తామని అనిల్ సాహ్ని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలతో కలకలం రేగింది. దీంతో ఆయన వ్యాఖ్యలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, వీటిపై వివరణ కోరామని, ఆయన వివరణ సహేతుకంగా లేని పక్షంలో క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని పార్టీ ప్రకటించింది. అలాగే లాలూ తన కుమారులను అదుపులో పెట్టుకోవాలని బీజేపీ సూచించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more