మలేషియాకు చెందిన బడ్జెట్ విమానయాన సంస్థ ‘ఎయిర్ఏషియా ఇండియా’ ఇటీవల ఇండిగో బాటలోనే పయనిస్తూ.. ఓ మహిళా ప్రయాణికురాలితో అసభ్యకరంగా, దురుసుగా వ్యవహరించిన ఘటన వెలుగులోకి రావడంతో.. దానిని రూపుమాకునే చర్యలకు ఎయిర్ లైన్స్ సంస్థ ప్రయత్నాలు చేపట్టినట్లు సమాచారం. ఇందులోభాగంగానే తమ సంస్థ విమానాల్లో ప్రయాణించే కస్టమర్లకు బంపర్ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది.
ఈ ఆపర్ ప్రకారం వచ్చే ఏడాది మే నుంచి జనవరి, 2019 మధ్య కాలంలో దేశ, విదేశాల్లోని పలు నగరాలకు వెళ్లే విమాన ప్రయాణికులకు కేవలం బేసిక్ దరల ప్రకారం టికెట్లను అపర్ చేయనుంది. ఎయిర్ ఏషియా సంస్థ విమానాల్లో ఈ ఆఫర్ కింద దేశీయ పర్యటనలకు రూ.99, విదేశీ పర్యటనలకు రూ.444 కనీస ధర (బేస్ ఫేర్)తో వన్వే టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ ధరలతో పాటు ఫ్యూయల్ సర్ చార్జి, ఎయిర్ పోర్టు ఫీజు, ఇతర పన్నులు కస్టమర్లు అదనంగా చెల్లించుకోవాల్సి వుంటుంది.
ఎయిర్ లైన్ వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా మాత్రమే కస్టమర్లు ఈ డిస్కౌంట్ టిక్కెట్లు బుక్ చేసుకోవాలని సంస్థవర్గాలు సూచించాయి. క్రితం రోజు రాత్రి 9.30 గంటల నుంచి ఈ నెల 19 వరకు ఈ టిక్కెట్లు అందుబాటులో వుండనున్నాయి. ‘దీని వల్ల హాలీడే ప్రయాణీకులు తమ ప్రయాణాల్ని మరింత బాగా ప్లాన్ చేసుకోగలుగుతారు’ అని ఎయిర్ ఏషియా ఇండి యా ఎండి, సిఇఒ అమర్ అబ్రోల్ చెప్పారు. ఇందకు తమ ఇండియా భాగస్వామి టాటాసన్స్ కూడా ప్రయాణికులకు తమ సహకారాలను అందిస్తారని అశాభావం వ్యక్తం చేశారు.
దేశంలో ఎయిర్ ఏషియా ఇండియా విమానాలు నడిచే బెంగుళూరు, కోచి, హైదరాబాద్, రాంచీ, భువనేశ్వర్, కోల్ కతా, న్యూఢిల్లీ, గోవాలకు రూ.99 బేస్ ఫేర్ తో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. తిరుచిరాపల్లి, కోచి, భువనేశ్వర్, ఢిల్లీ, జైపూర్ నుంచి కౌలాలంపూర్ వెళ్లే ఎయిర్ఏషియా విమానాలు, ముంబై, కోల్కతా నుంచి బాలి వెళ్లే విమానాలు, జైపూర్, కోల్కతా, కోచి, చెన్నై, బెంగుళూరు నుంచి బ్యాంకాక్ వెళ్లే ఎయిర్ఏషియా విమానాల్లో రూ.444 బేస్ ఫేర్తో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more