యువతులను నయవంచన చేసి వారితో తన శారీరిక అవసరాలు తీర్చుకోవడమే అతని పని. ఓ వైపు సంఘంలో గౌరవంగా, హుందాగా వుండే స్థాయిలోనే వున్నా.. బుద్ది మాత్రం నీచవునీడన నడిచి.. అమ్మాయిలను, మహిళలను మోసం చేయడమే పనిగా మలుచుకున్న ఓ నటుడికి పోలీసులు ఇవాళ అరదండాలు వేశారు. 'ఐమ్యాక్స్' ధియేటర్ మేనేజర్, సినీ నటుడు వెంకట ప్రసాద్ (ఐమ్యాక్స్ వెంకట్) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్, బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 10లో నివాసముండే ఓ యువతి (33) ప్రసాద్ ఐ మ్యాక్స్ లో పనిచేస్తోంది. పది సంవత్సరాల క్రితం వివాహం అయినప్పటికీ భర్తతో మనస్పర్ధలు రావడంతో ఆమె విడిగా ఉంటోంది. కోర్టులో విడాకుల కేసు నడుస్తోంది. ఇదిలా ఉండగా ఐమ్యాక్స్లో పనిచేసే మేనేజర్ వెంకటప్రసాద్ కన్ను ఆమెపై పడింది. ఆమెతో మాటలు కలిపి సన్నిహితమయ్యాడు. ప్రేమిస్తున్నానని నమ్మబలికాడు.
ఆమెకు విడాకులు రాగానే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో గత ఏడేళ్లుగా వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె రెండు సార్లు గర్భం దాల్చగా పెళ్లి చేసుకునే వరకు పిల్లలు వద్దంటూ గర్భస్రావం చేయించాడు. ఈ క్రమంలో ప్రసాద్ సినిమాల్లో అవకాశాలు సంపాదించుకున్నాడు. 'బాహుబలి'లో ప్రభాస్ కు పెంపుడు తండ్రిగా నటించాడు. అలాగే తాజాగా విజయం సాధించిన 'గురుడవేగ'లో సీఎం పిఏగా కూడా నటించాడు.
ఇంతలో ఆమెకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో ఆమె పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో ముఖం చాటేయడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె ఆరాతీయగా, అతను మరో యువతితో తిరుగుతున్నట్టు తెలుసుకుంది. దీంతో నేరుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఆమె... తనను మోసం చేశాడంటూ ఫిర్యాదు చేసింది. దీంతో విచారణకు దిగిన పోలీసులు తమ దర్యాప్తులో అతను చాలా మంది యువతులను మోసం చేసినట్టు గుర్తించారు. దీంతో 420, 506,509, 354(డి) కింద కేసులు నమోదు చేసి అతనిని అరెస్టు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more