ప్రపంచ నల్లకుబేరుల జాబితాలో వీరికి స్థానం వుందంటూ గత ఏడాదిన్నర క్రితం పనామా పేపర్ల ద్వారా లీకులను విడుదల చేసిన సంస్థ ఇండియన్ కాన్సోర్టియమ్ అప్ ఇన్విస్టిగేటివ్ జర్నలిస్ట్ (ఐసిఐజే) తాజాగా వెలుగులోకి తీసుకువచ్చిన ప్యారడైజ్ పేపర్ల పత్రాలలో భారతీయులు సంఖ్య ఏకంగా 719గా వుందన్న విషయాన్ని ఇప్పటికే బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే గతంలో విడుదల చేసిన పనామా పేపర్లలో కూడా వున్న ప్రముఖులు పేర్లు తాజా ప్యారడైజ్ పేపర్లలోనూ వున్నాయని స్పష్టం కావడంతో అనేక మంది భారత నల్లకుబేరుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి
దేశ ప్రజల సోమ్మును బ్యాంకుల నుంచి రుణాలుగా పోంది.. వాటిని ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన అర్థిక నేరస్థుడు విజయ్ మాల్యా పేరు కూడా ఈ జాబితాలో వుండగా, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సహా ఎందరెందరో వున్నారన్న విషయాన్ని కూడా బాహాటంగానే చెప్పేసింది. ఇక ఇటు నవ్యాంధ్ర ప్రదేశ్ కు చెందిన అధికార పార్టీ చంద్రబాబు నాయుడి మిత్రుడు, అతని కుటుంబ వ్యాపారమైన హెరిటేజ్ సంస్థలో డైరెక్టర్ మోటపర్తి శివరామవరప్రసాద్ పేరు మూడు పర్యాయాలు జాబితాలో వున్న విషయం తెలిసిందే.
ఆయనకు ఎంపీ హోల్డింగ్స్ అసోసియేట్స్ లిమిటెడ్, బ్యాలీవార్డ్ లిమిటెడ్, బెట్ కెమీ వెంచర్స్ లిమిటెడ్ సంస్థలతో సంబంధమున్నట్లు పనామా పేపర్లు బయటపెట్టాయి. బిట్రీష్ వెర్జిన్ ఐల్యాండ్స్, ఇసేల్ అప్ మమ్యాన్, ఈక్వేడార్, ఘనా, పనామా తదితర దేశాలలో వ్యాపార లావాదేవీలు వున్నట్లు కూడా పనామా పేపర్లు బయటపెట్టాయి. కాగా ప్యారడైజ్ పేపర్లు మాత్రం ఏకంగా నవ్యాంధ్ర విఫక్ష పార్టీకి చెందిన వైఎస్ జగన్ పేరునే వెలుగులోకి తీసుకువచ్చింది.
అంతర్జాతీయ నల్లధన కుబేరుల జాబితాలో వైఎస్ జగన్ కూడా వున్నారని తాజాగా ఫ్యారడైజ్ పేపర్లు వెల్లడిస్తున్నాయి. పనామా పేపర్ల మాదిరిగానే ప్యారడైజ్ పేపర్లపై ఇన్వెస్టిగేషన్ జరిపిన ఇండియన్ ఎక్స్ ప్రెస్ సంస్థ వీటిపై వరుస కథనాలను ప్రచురించనున్నట్టు ప్రకటించింది. ఈ బిగ్ డేటా ప్రస్తుతం భారత రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. 'యాంటీ బ్లాక్ మనీ డే'ను నిర్వహించేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమైన తరుణంలో, ఈ బిగ్ డేటా విడుదల కావడం చర్చనీయాంశంగా మారింది.
బెర్ముడాస్ న్యాయ సలహాల సంస్థ అప్లీబీ, సింగపూర్స్ ఆసియాసిటీలు సంస్థలు సంయుక్తంగా ప్రపంచ నల్లకుబేరులకు తమ ధనాన్ని దాచుకునేందుకు స్వర్గధామాలైన ప్రాంతాలను సంస్థలను ప్రతిపాదించే పనిలో వుంటాయని, అయితే వీటికి సంబంధించిన పేపర్లు లీక్ కావడంతో అందులో భారతీయుల పేర్లు కూడా వున్నాయి. వాటిలోనే వైసీపీ అధినేత జగన్ పేరు కూడా ఉండటం ఆ పార్టీ శ్రేణులకు షాక్ ఇచ్చే అంశమే. ఈ అంశాన్ని టీడీపీ నేతలు తమకు అనుకూలంగా మలచుకోబోతున్నారు. ఓ వైపు పాదయాత్రలో జగన్ ప్రజల్లోకి వెళ్తుండగా, ఇప్పడీ అంశమే టీడీపీ నేతలకు కలిసివచ్చే బ్రహ్మాస్త్రంగా అంశంగా మారనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more