న్యూయార్క్ నగరంలో ఉగ్రవాదులు అద్దె ట్రక్కుతో సృష్టించిన మారణకాంఢ విషాధాఛాయలు, ఘటన తాలుకు గుర్తులు కూడా ఇంకా చెరిగిపోకముందే.. అమెరికాలోని కొలరాడో రాష్ట్రం మరో బీభత్సకాండకు మూగసాక్షిగా నిలిచింది. కొలరాడోలోని వాల్ మార్ట్ స్టోర్ లో ఓ వ్యక్తి తుపాకితో కస్టమర్లపై విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురు చనిపోగా, మరికొందరు తీవ్రగాయాలపాలయ్యారని సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరుగుతందని అధికారులు తెలిపారు.
భారత కాల మానం ప్రకారం ఇవాళ ఉదయం కొలరాడొ రాష్ట్రం థోర్న్టన్ నగరంలోని ఓ షాపింగ్ మాల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనలో ఇప్పటిదాకా ఇద్దరు మృతి చెందగా, ఒకరు గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు. సబర్బన్ డెన్వర్ లోని వాల్ మార్ట్ షాపింగ్ మాల్ లో తుపాకీ మోత మోగినట్లు తెలుస్తోంది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు.
మాల్ చుట్టుపక్కలకు వెళ్లొద్దని స్థానికులకు పోలీసులు సూచించారు. పరిస్థితి తమకూ సరిగ్గా తెలీటం లేదని.. చాలా మందికి గాయాలైనట్లు ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఐదు నుంచి ఆరు రౌండ్ల కాల్పులు జరిగాయని.. మాల్లో ఉన్న ప్రజలు భయంతో కేకలు వేశారని మార్ట్ ఉద్యోగి ఒకరు తెలిపారు. స్థానిక ఛానెళ్లు మాత్రం 30 రౌండ్ల దాకా కాల్పులు జరిగాయని, 9 మంది గాయపడ్డారని చెప్పటం గమనార్హం.
ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురు మరణించారని అధికారులు దృవీకరించారు. ఇద్దరు పురుషులు ఘటనాస్థలంలోనే చనిపోగా, మరో మహిళ మాత్రం అస్పత్రిలో చికిత్స పోందుతూ మరణించిందని తెలిపారు. ఈ ఘటనను ఉగ్రదాడి కోణం లేదని చెప్పలేమని అంటూనే.. ఉగ్రదాడి నేపథ్యంలో కాల్పులు జరిగినట్టు కూడా అధారాలు లేవని అధికారులు చెప్పారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలను అధికారులు తెలియాజేయాల్సి ఉంది.
#BREAKING: Police say suspect in Walmart shooting IS AT LARGE; 48 witnesses taken by bus to police station - KWGNhttps://t.co/T0S5bweXJZ pic.twitter.com/E1tMsbd9IQ
— Breaking911 (@Breaking911) November 2, 2017
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more