ఒక తప్పు చేసినప్పుడే దానిని సరిదిద్దుకోవాలని.. కానీ దానిని దాచడానికి ప్రయత్నిస్తే అనేక తప్పులు తెలియకుండానే చేస్తామని ఇలానే మనుషులలో నేరప్రవృత్తి పెరుగుతుందని చట్టం మనకు అనేక ఘటనల ద్వారా ఉదహరిస్తుంది. ఈ విషయాలను చెప్పి.. పెడదారిబాట పట్టిన యువతను సన్మార్గంలో నడిపించాల్సిన డీఎస్పీ స్థాయి అధికారే.. వక్రమార్గం పడితే.. చివరకు కటకటాల పాలు కావడం ఖాయమే. ఆర్టీసీ విజిలెన్స్ విభాగంలో డీఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న రవిబాబు విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది.
నిజం నిలకడ మీదైనా సరే వెలుగులోకి వస్తుందని తెలిసి కూడా తప్పు మీద తప్పు చేసిన డీఎస్సీ దాసరి రవిబాబు.. తన తప్పులు బయటపడటంతో ఇక చేసేది లేక ఎట్టకేలకు చోడవరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. అనంతరం ఆయనను విశాఖ తరలిస్తున్నారు. ఈ నెల 6వ తేదీన జరిగిన కొపెర్ల సత్యనారాయణ రాజు అలియాస్ గేదెల రాజు హత్య కేసులో ఏ1 నిందితుడు, డీఎస్పీ దాసరి రవిబాబు, ఏ2 నిందితుడు క్షత్రియభేరి దినపత్రిక ఎండీ భూపతిరాజు శ్రీనివాసరాజు ఉన్నారు. అయితే గేదెల రాజు హత్య జరిగిన మరుసటి రోజు నుంచే ప్రధాన నిందితులిద్దరూ పరారీలో ఉన్నారు.
రౌడీ షీటర్ గేదెల రాజు హత్య కేసుకు డీఎస్పీకీ సంబంధమేంటి..?
అందుకు కాకర పద్మలత తండ్రి, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు కూతురు కాకర పద్మలతను.. రౌడీ షీటర్ గేదెల రాజు చేత డీఎస్పీ హత్య చేయించాడన్న అభియోగాలు వున్నాయని కూడా పోలీసులు తెలిపారు. అయితే ఈ హత్యకేసులో తనకు రావాల్సిన సుపారీ (డీఎస్సీ ఇస్తానని చెప్పిన డబ్బును) ఇవ్వకపోవడంతో డీఎస్సీ రవిబాబుపై గేదెల రాజు ఒత్తిడి తీసుకువచ్చినట్లు, ఈ నేపథ్యంలో అతడిని అడ్డు తొలగించుకునేందుకు స్థానిక పాత్రికేయుడు భూపతిరాజు శ్రీనివాసరాజు సహకారంతో రాజును హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా హత్య జరిగిన నుంచీ ప్రధాన నిందితులిద్దరూ పరారీలో వున్నారు.
కాకర పద్మలతతో డీఎస్పీకి సంబంధమేమిటీ..?
మాజీ ఎమ్మెల్యే కూతురైనందున్న కాకర పద్మలతతో దాసరి రవిబాబు సన్నిహితంగా మెలిగాడు. అది కాస్తా వారిద్దరి మధ్య వ్యక్తిగత, శారీరిక సంబంధాలకు కూడా దారితీసింది. అవసరాలను తీర్చుకున్న తరువాత రవిబాబు అమెను దూరం పెట్టాడు. దీంతో తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. నయవంచన చేశాడని.. అమె పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. తాను వుంటున్న ఇంట్లోంచి కూడా తనను పంపేందుకు ఇంటి యజమానిపై తీవ్రమైన ఒత్తడి తీసుకువస్తున్నాడని తన పిర్యాదులో పద్మలత పేర్కొంది.
అ సమయంలో మధురవాడ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న రవిబాబుపై ఉన్నతాధికారులు విచారణ జరిపారు. అక్కడే విధులను నిర్వహిస్తే.. పద్మలత కు ప్రమాదం పొంచివుందన్న అలోచన చేసిన అధికారులు ముందుగా అతన్ని సస్పెండ్ చేశారు. ఆ తరువాత రవిబాబును రీకాల్ చేసిన అధికారులు అయనకు అర్టీసీ విజిలెన్స్ విభాగం డీఎస్పీగా విధులను అప్పగించారు. పద్మలత వల్లే తనకు ఈ దర్భర పరిస్థితి వచ్చిందని భావించిన రవిబాబు.. అమెను హత్య చేయించడానికి రౌడీషీటర్ గేదెల రాజుతో కలసి ఒప్పందం చేసుకుని సుపారీ మాట్లాడుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more