టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో తన ఓటమి బాధ్యత టీడీపీ కార్యకర్తలదేనని అరోపించారు. తన నుంచి అనేక సేవలను పోందిన పార్టీ నాయకులు కార్యకర్తలు.. అ మేరకు ఎన్నికలలో మాత్రం పనిచేయలేదని అవేదన వ్యక్తం చేశారు. ఇది తన దురదృష్టమనే చెప్పాలన్నారు. పుత్తూరులో నగరి నియోజకవర్గ టీడీపీ సమావేశంలో ఆయన అవేదన భరిత ప్రసంగాన్ని చేశారు.
అధిష్టానానికి తన గురించి తెలుసు కాబట్టి.. మర్యాదపూర్వకంగా ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారని అన్నారు. అదే తాను ఎన్నికలలో విజియం సాధించివుంటే.. కచ్చితంగా మంత్రిని అయ్యేవాడినని అభిప్రాయపడ్డారు.
కిరణ్కుమార్ రెడ్డి సీఎంగా వున్న హాయాంలో ఆయన వద్దకు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా వెళ్లి పేదలకుసీఎం రిలీఫ్ ఫండ్ తీసుకువచ్చిన ఘనత తనదని తెలిపారు. ఇప్పుడు కూడా సీఎం చంద్రబాబును ఒప్పించి జిల్లాలో 80 మందికి రూ.60 లక్షలు సీఎం రిలీఫ ఫండ్ తీసుకొచ్చానని చెప్పారు,
ప్రభుత్వ పథకాల అమలులో 16 అంశాల్లో కుప్పం తరువాత నగరి రెండో స్థానంలో ఉందని గుర్తు చేశారు. గృహ నిర్మాణంలో 6200 ఇళ్లు మంజూరు చేసుకొచ్చి ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. ఇంకా మరో వెయ్యి ఇళ్ళ మంజూరుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. కార్యకర్తలు, నేతలు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఈ విషయాలను ప్రజలకు తెలియజేసి పార్టీ ప్రతిష్ట పెంచాలన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడిందని ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది కనుక ప్రతి వార్డు, బూత్ కమిటీలకు ఇద్దరి నుంచి ఐదుగురిని నియమించుకుని ఓటర్లను కలిసి ప్రభుత్వ పథకాలు తెలియజేయాలన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more