పాత నోట్ల పంచాయితీపై ఓ ప్రముఖ నటుడు, రాజకీయ నేతను న్యాయస్థానం మెట్లు ఎక్కించేలా చేస్తుంది. అయితే ఇక్కడ ఈ సలహా ఇచ్చింది కూడా ఓ న్యాయస్థానం కావడమే గమనర్హాం. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తన ఇంటి నుంచి బయలుదేరుతున్న క్రమంలో ఎన్నికల అదికారులు అకస్మాత్తుగా వచ్చి తన కారులోని రూ. 9లక్షలను స్వాధీనం చేసుకున్న ఘటనపై హీరో, సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు శరత్ కుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. తన నుంచి ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్న అక్షరాల రూ.9లక్షలకు తగిన లెక్కలు చూపడంతో వాటిని ఈసీ అధికారులు తిరిగి చెల్లించనున్నారు.
ఇంతవరకు బాగానే వున్నా.. ఇక్కడే వచ్చింది అసలు సమస్య. స్వాధీనం చేసుకన్న క్రమంలో అప్పటి పాత కరెన్సీలోని రూ.500, రూ.1000 నో్ట్లనే ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వాటినే తిరిగి ఇచ్చేస్తామని చెప్పడంతో.. తనకు ఆ నోట్లు ఇచ్చినంత మాత్రన లాభం ఏంటీ.. ఏలా తాను పాట నోట్లను తీసుకునేది అని ప్రశ్నించిన శరత్ కుమార్.. ఏకంగా న్యాయస్థానాన్ని అశ్రయించారు. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో లేదా డీడీ రూపంలో ఇవ్వాలని ఆయన మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై న్యాయమూర్తి ఎం.దురైస్వామి విచారణ జరిపి.. శరత్ కుమార్ కోరుతున్నట్టుగా చెక్కు లేదా డీడీ రూపంలో ఇవ్వడం కుదరదని పేర్కొంటూ పిటిషన్ను కొట్టివేశారు. కాగా పాత కరెన్సీ నోట్లకు సంబంధించి ఎలాంటి పిటిషన్ దాఖలైన దాన్ని విచారణకు స్వీకరించవద్దని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు కోనసాగుతున్న నేపథ్యంలో తాము ఈ పిటీషన్ ను విచారించలేమని మద్రాసు రాష్టోన్నత న్యాయస్థానం న్యాయమూర్తి దురైస్వామి పిటీషన్ ను తోసిపుచ్చారు.
సింగిల్ జడ్జీ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ద్విసభ్య ధర్మాసనానికి వెళ్లిన శరత్ కుమార్ కు అక్కడా చుక్కెదురైంది. ఈ పిటిషన్ ను విచారిచిన న్యాయమూర్తులు రాజీవ్ సుందర్, ఎన్.సతీష్ కుమార్ లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. కాగా, నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాల మేరకు ఈ కేసుపై విచారణ చేపట్టలేమనీ, కానీ, ఒక సూచనచేస్తామని పేర్కొంటూ, ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సలహా ఇచ్చింది. మరి శరత్ కుమార్ సుప్రీం తలుపులు తట్టేనా..? అయనకు న్యాయం జరిగేనా..? అన్నది మాత్రం వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more