వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి మరోసారి భారీగా వలసలు మొదలు కాబోతున్నాయి.నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ ఫలితాల అనంతరం టీడీపీలో కొత్త ఉత్సహం కనిపిస్తుండగా.. వచ్చే ఎన్నికల్లో విజయంపై ధీమా సన్నగిల్లుతుండటంతో వైసీపీ నేతలు పార్టీ వీడేందుకు మొగ్గు చూపుతున్నారని సమాచారం. అదే సమయంలో వైసీపీ దుకాణం ఖాళీ చేయించే దిశగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలపైనే ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగించించబోతున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా నుంచి నలుగురు కీలక వైఎస్సార్సీపీ నేతలతో పాటు అనంతపురం జిల్లాకు చెందిన కీలకమైన నేత ఒకరు టీడీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది.వారిలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, అనంతపురం మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. వీరితో పాటు మరో ముగ్గురు కూడా టీడీపీలోకి చేరనున్నారని వార్తలు వస్తున్నప్పటికీ, వారు ఎవరన్నది తెలియాల్సి వుంది. కాగా, 2014 ఎన్నికల్లో కర్నూలు జిల్లాను దాదాపు వైకాపా స్వీప్ చేయగా, ఆపై దివంగత భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ సహా పలువురు ఎమ్మెల్యేలు పచ్చ కండువాలు కప్పుకున్న సంగతి తెలిసిందే. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పేర్లు కూడా గత కొద్దికాలంగా జంప్ జిలానీల జాబితాలో వినిపిస్తున్నాయి. వీరికి గాలం వేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు, తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ను గ్యారెంటీగా ఇస్తామని చెబుతున్నట్టు సమాచారం.
ఆదినారాయణ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, సీఎం రమేష్ మంత్రాగం నడిపినట్టు సమాచారం. రేపటి నుంచి మొదలై వారంపాటు ఈ వలసలు కొనసాగుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు సంకేతాలు అందుతుండగా.. ఉన్న నేతల ఫిరాయింపులు వైసీపీ అధినేత జగన్ కు మరింత ఇబ్బందికరంగా మారాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more