హైదరాబాదులో అరగంటలో ఏర్పడిన క్యుములోనింబస్ మేఘాలే ఏకధాటిగా నాలుగు గంటల పాటు కుంభవృష్టి కురిపించడానికి కారణమయ్యాయని చెబుతున్నారు వాతావరణశాఖ అధికారులు. ఉత్తర ఒడిషా నుంచి ఉత్తర కేరళ మీదుగా రాయలసీమ, తెలంగాణకు ఆవర్తన ద్రోణి ఆవరించి ఉండడం, దానికి అనుగుణంగా మధ్యతూర్పు బంగాళఖాతంలో మరో ద్రోణి ఏర్పడడంతో నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని చెబుతోంది. వీటి మూలంగా పిడుగుల పడే అవకాశాలు వుంటాయని అంచనా వేశామని, అయితే కేవలం అరగంట వ్యవధిలోనే క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడి నగరంలో వర్షభీభత్సం సృష్టించిందని అన్నారు.
అక్టోబర్ మాసంలో తెలంగాణలో నిన్న కురిసిన వర్షం అత్యధిక స్థాయిని నమోదు చేసుకుందని అన్నారు. ఉపరితల ఆవర్తనానికి తోడు వాతావరణం ఒక్కసారిగా చల్లడడం కూడా కుంభవృష్టికి కారణమంటున్నారు అధికారులు. వెదర్ చల్లబడడంతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు దంచికొడుతున్నాయని చెప్తున్నారు. ఆదివారంతో పోలిస్తే… సోమవారం పగలు కాస్త చల్లబడినా… ఉష్ణోగ్రతలు సాధారణం కన్న ఒక డిగ్రీ పెరిగి 32 డిగ్రీలకు చేరింది. ఇక గాలిలో తేమ కూడా 87శాతానికి చేరడంతో వెదర్ కూలయ్యిందని… దీంతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి కుంభవృష్టి కురిసిందని చెప్తున్నారు.
కాగా ఉపరితల అవర్తనం, ఉపరితల ద్రోణుల ప్రభావం ఇంకా తెలుగురాష్ట్రాలపై ఉందని దీంతో ప్రజలు మరీ ముఖ్యంగా హైదరాబాదీలు అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరో 48 గంటల పాటు ఉపరితల అవర్తనాల ప్రభావం వుంటుందని కూడా చెబుతున్నారు. వాతావరణం ఇవాళ కూడా చల్లగానే వున్న నేపథ్యంలో క్యూములో నింబస్ మేఘాలు ఏర్పాడి వర్షం కురిసే అవకాశాలు కూడా వున్నాయని.. వాతావరణ శాఖ అధికారులు పేర్కోంటున్నారు.
గడిచిన 24 గంటల్లో జిల్లాల కన్నా రాజధాని హైదరాబాద్ లోనే 36శాతం అదనంగా వర్షం కురిసింది. గత పదేళ్లలో అక్టోబర్ లో కురిసిన అత్యధిక వర్షపాతం ఇదే అంటున్నారు వెదర్ ఆఫీసర్లు. అత్యధికంగా మీరాలంలో 13.2 సెం.మీ, రాజేంద్ర నగర్ లో 12.6 సెం.మీ, అంబర్ పేటలో 12.3, గోల్కొండలో 10.4., మోండా మార్కెట్ లో 10.4 సెం.మీ,ముషీరాబాద్, కాప్రాలో 9.5 సెం.మీ, నారాయణగూడలో 9.3 సెం.మీ, సైదాబాద్ లో 9.1 సెం.మీ, బండ్లగూడ 8.9 సెం.మీ, ఎల్భీ నగర్ 8.4, చార్మినార్ 7.6, అమీర్ పేటలో 7.5 సెం.మీల వర్షం కురిసిందని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more