షిరిడీ సాయినాథుడి దర్శనాన్ని ఒక్క రోజులో ముగించుకుని మళ్లీ తమ స్వస్థాలలకు చేరుకునేలా ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో రోజుల తరబడి అనేక వ్యయప్రయాసలకు ఓర్చి ప్రయాణాలు చేస్తున్నారు. దీనికి తోడు రోడ్డు మార్గం కూడా అంతగా అనువుగా లేకపోవడం.. ఆ మార్గం ఇంకా అభివృద్దికి ఆమడ దూరంగా వుండటంతో.. భక్తులు కొంత నిర్లిఫ్తంగా వున్నారు. అయితే రైలు మార్గం వుందిగా అంటే.. అదీ అంతే.. కేవలం మన్మాడ్ నుంచి సాయినగర్ షిరిడీ చేరుకునేందుకే రెండున్నర గంటల సమయం పడుతుంది.
ఇదే సమయాన్ని సక్రమంగా వెచ్చిస్తే అదే సమయంలో ఏకంగా హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఏకంగా షిరిడీకి చేరుకోవచ్చు. మళ్లీ తిరిగి గమ్యస్థానానికి చేరుకోవచ్చు. అదెలా అంటే అదే వాయుమార్గం. పవిత్ర షిరిడీ సాయి దర్శనానికి వచ్చే సంపన్న, ఉన్నత మధ్య తరగతి భక్తులపై ఎట్టకేలకు సాయినాధుడు కటాక్షించాడు. షిరిడీలో వారి కోసం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సిద్దం చేశారు.
సాయి భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విమానాశ్రయం వచ్చనెల నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అక్టోబర్ 1న విమానాశ్రయాన్ని ఆవిష్కరిస్తారు. అదే రోజు షిరిడీ నుంచి ముంబై వరకు వెళ్లే విమానాలను కూడా ఆయన ప్రారంభించనున్నారు. ఆ తరువాత షిరిడీలో ప్రారంభం కానున్న సాయినాథుడి మహా సమాధి శతాబ్ది ఉత్సవాలలో రాష్ట్రపతి హాజరుకానున్నారు. షిరిడీలో సాయి దర్శనాన్ని చేసుకున్న తరువాత ఆయన ఈ కార్యక్రమాలలో పాల్గొననున్నారని సమాచారం.
కాగా విమానాశ్రయ రాకతో షిరిడీ సహా పరిసర ప్రాంతాలన్నీ శరవేగంగా అభివృద్ది బాటలో దూసుకుపోతాయని స్థానికులు అశాభావం వక్యం చేస్తున్నారు, దేశ అర్థిక రాజధాని ముంబై నుంచి షిరిడీకి కేవలం 40 నిమిషాలలో రావచ్చుని అధికారులు తెలుసగా, ఈ మేరకు ఇవాళ ముంబై నుంచి షిరీడీకి చేరుకున్న తొలి పరీక్షా విమానం.. ఏకంగా 45 నిమిషాల వ్యవధిలో చేరకుంది. దీంతో కొత్త ఏరోనాటికల్ రూట్ కావడంతో అలస్యమైందని, విమానాశ్రయం ప్రారంభం నాటికి ఈ సమయం కేవలం నలభై నిమిషాలకు చేరుకుంటుందని షిరిడీ ఏటీసీ అధికారవర్గాలు తెలిపాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more