పోరుగు దేశమైనా సక్యతతో మెలిగితే.. ఎంత అండ కావాలంటే అంత ఇస్తామన్ని చెప్పినా.. కుట్రలు, కుతంత్రాలతో అనుక్షణం తమ దేశాభివృద్దిపై గురి కన్నా భారత్ లో ఎలా అలజడులు సృష్టించాలా అన్న అంశంపైనే అధిక సమయాన్ని, ధనాన్ని వెచ్చింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ, కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ.. అనుక్షణం భారత్ పై విషం కక్కుతున్న పాకిస్థాన్ కపట బద్ది ఐక్యరాజ్య సమితి వేదికగా బట్టబయలైంది. నీతి, న్యాయం, ధర్మం తప్పి వారు చేసే తప్పుడు పనులన్నీ భారత దేశమే చేస్తుందని సిగ్గు తప్పి చెప్పిన పాకిస్తాన్ కు అకాశంపై ఉమ్మితే ఏం జరుగుతుందో ఇప్పడు తెలిసివచ్చింది. బట్టాచోర్ నాటాకాలు ఎక్కవ కాలం సాగవని నిరూపితమైంది.
దొంగే దొంగ దొంగ అని అరిచిన చందంగా అడిన నాటకం బహిర్గతమేంది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో గత మూడు రోజులుగా భారత్ పై అసత్యాలతో విరుచుకుపడుతున్న పాక్ తాజాగా మరో అతి పెద్ద అబద్ధం ఆడి భారత్ ను దోషిగా నిలబెట్టాలని చూడగా, అది కాస్తా బహిర్గమై.. పాక్ అనుసరిస్తున్న కపటబుద్దిని బట్టబయలు చేసింది. క్రితం రోజున యుఎన్ సమావేశంలో పాకిస్థాన్ దౌత్యవేత్త మలీహా లోధీ మాట్లాడుతూ.. కాశ్మీర్ లో భారత్ అనుసరిస్తున్న విధానాలపై ధ్వజమెత్తింది.
కాశ్మీర్ లో భారత అర్మీ బలగాలు ఎంతటి దారుణాలకు పాల్పడుతున్నాయో ఈ చిత్రమే ప్రస్పుటిస్తుందని అరోపించిన అమె.. ముఖం నిండా పెల్లెట్ గన్స్ గాయాలతో ఉన్న ఓ బాలిక ఫొటోను చూపించి అమె కాశ్మీర్ బాలికని, ఏర్పాటు వాది బుర్హన్ వనిని కాశ్మీర్ లోని భద్రతా దళాలు ఎన్ కౌంటర్ చేసిన అనంతరం చెలరేగిన హింసను అణిచివేసేందుకు భారత్ అర్మీ అక్కిడి స్థానికులను ఇలా చిత్రహింసలకు గురిచేసిందని కూడా అరోపించారు.
అయితే నిజానికి ఆమె చూపించిన బాలిక కశ్మీరీ కాదు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాయపడిన పాలస్తీనాలోని గాజాకు చెందిన బాలిక రవా అబు జోమా ఫొటో అది. అది కూడా 2014లో జరిగిన దాడుల అనంతరం జెరూసలేంకు చెందిన హైదీ లెవీన్ అనే ఫొటో జర్నలిస్ట్ ఈ ఫొటో తీశాడు. అప్పట్లో ఈ ఫొటో సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఇదే ఫొటోను ఉపయోగించుకుని భారత్పై మరోమారు అభాండాలు వేయాలని పాక్ ప్రయత్నించింది. బాధితురాలిని కాశ్మీర్ యువతిగా చెప్పేందుకు ప్రయత్నించి అంతర్జాతీయ సమాజం ముందు పాక్ బొక్కబోర్లా పడింది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేసి.. విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ పాక్ కుట్రను భగ్నం చేసిన విధానాన్ని కూడా స్వాగతించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more